మన తెలుగులో సినిమా విడుదల అయినా కాకపోయినా సరే ఆ సినిమా గురించి జరిగే చర్చలు మాత్రం కాస్త చికాకుగానే ఉంటాయి అనేది వాస్తవం. లాక్ డౌన్ లో కూడా జనాలు అనవసర ప్రచారాలు .... అనవసర వార్తలను ఇప్పుడు ప్రచారం చేస్తూ పండగ చేసుకునే ప్రయత్నాలను ఎక్కువగా చేస్తున్నారు. చిరంజీవి ఆచార్య సినిమా విషయంలో ఇప్పుడు ఇదే విధంగా వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. చిరంజీవి సైరా వచ్చి యేడాది కి దగ్గర పడుతోంది. ఇక సైరా తర్వాత చిరు ఆచార్య సినిమా చేస్తానని ప్రకటించి యేడాది దాటి పోయింది. అసలు ఈ సినిమా గురించి యేడాదిన్న ర కాలంగా వార్తలు నానుతూనే ఉన్నాయి.
ఆయన సినిమాలో రామ్ చరణ్ లేదా మహేష్ బాబు లేదా ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ముందుగా కొరటాల మహేష్ తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో మహేష్ డేట్ల కోసం ట్రై చేశారని.. ఇందుకోసం రు. 30 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారన్న ప్రచారం గట్టిగా జరిగింది. అది నిజం అయినా కాకపోయినా సరే బాలీవుడ్ లో కూడా ఇప్పుడు దీని గురించి చర్చలు మొదలుపెట్టారు. ఈ సినిమాను చిరంజీవి పాన్ ఇండియా సినిమా గా తీసుకుని రావాలని భావిస్తున్నారని అందుకే రణవీర్ సింగ్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు.
రణవీర్ సింగ్ ఈ సినిమాలో చేయడానికి గానూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని సమాచారం. ఇదంతా నేషనల్ గాసిప్పులో కూడా వస్తోంది. రణవీర్ చిరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో లేదో గాని రాయడం మాత్రం రాస్తున్నారు. దీనిపై చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఖాతాలో ఒక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి రణవీర్ నటిస్తాడా లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. రణవీర్ నటిస్తే అతను అడిగిన మొత్తం ఇస్తారా లేదా అనేది కూడా చెప్పలేం..!