మాస్ మహారాజ రవితేజ వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న కూడా విజయం దక్కట్లేదు. డిస్కోరాజా ఫ్లాప్ కావడమ్తో రవితేజ మార్కెట్ విపరీతంగా తగ్గింది. ఆ సినిమాపై రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంది. కానీ సినిమా నడిపించిన విధానం ఆసక్తికరంగా లేకపోవడంతో బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దాంతో రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అనిపించుకుంది.

 

అయితే ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ చిత్రం హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన డాన్ శీను రవితేజకి మంచి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.

 

అయితే కరోనా కారణంగా ఈ చిత్ర రిలీజ్ వాయిదా పడింది. మళ్ళీ థియేటర్లు తెరుచుకున్నాకే కొత్త రిలీజ్ డేట్ వెలువడనుంది. అయితే థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్న విషయం మాత్రం ఇప్పట్లో తెలిసేలా లేదు. అదలా ఉంటే రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో మరో సినిమా ఒప్పుకున్నాడు. క్రాక్ సినిమా పూర్తికాగానే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రూపొందనుంది.అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ సెలెక్ట్ అయ్యారని సమాచారం.

 

ఇస్మార్ట్ లేడీస్ నిధి అగర్వాల్ తో పాటు నభా నటేష్ కూడా ఉందట. అయితే వీరిద్దరే కాదు మరో హీరోయిన్ కూడా రవితేజతో రొమాన్స్ చేయనుందట. ఆర్ ఎక్స్ భామ పాయల్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో రవితేజతో కలిసి స్టెప్పులేయనుందట. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. మొత్తానికి రవితేజ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: