టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ బిజీ హీరోయిన్ ఎవరంటే చెప్పే హీరోయిన్ల పేర్లలో పూజా హెగ్డే మొదటి వరుసలో ఉంటుంది. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అటుపై బాగానే అవకాశాలు పొందింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఈ భామకు ట్రాక్ రికార్డ్ కూడా బాగానే ఉంది.   ప్రస్తుతం  యంగ్ రెబల్ స్టార్  ప్ర‌భాస్ హీరోగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న 'సాహో' మూవీ  మొత్తానికి నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుని,  బాక్సాఫీస్ వద్ద  సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అయింది.  ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీల నటిస్తున్నాడు.  ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంంది.  ఈ ఏడాది అలా వైకుంఠపురములో సూపర్ హిట్ అందుకుంది.   

 

ఈ మూవీలో పూజా హెగ్డే  పాత్ర   ఓ స్కూల్ టీచర్ గా కనిపించనుండదట. ఈ సినిమా  పీరియాడిక్ మూవీ కావడంతో  పూజా గెటప్ కూడా  ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ పోలి ఉండేలా డిజైన్ చేస్తున్నాడట దర్శకుడు రాధా కృష్ణ.  ఇప్పటికే ఆమె లుక్ పై కసరత్తు మొదలు పెట్టారట ఆయన. ఐతే దీని పై ఎటువంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికి ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. 

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షూటింగులు చేసేటప్పుడు ప్రతిరోజూ పాత్రకు తగ్గట్టు ముస్తాబు అవుతా. మేకప్‌, హెయిర్‌ స్టయిలింగ్‌, డ్రస్సింగ్‌ తప్పవు. ప్రతిరోజూ నా జుట్టు, శరీరానికి టార్చరే. అందువల్ల, ఇప్పుడీ లాక్‌డౌన్‌ బ్రేక్‌ని ఎంజాయ్‌ చేస్తున్నా.  ఇంట్లో ఉన్నపుడు ఎక్కువగా మేకప్ వేసుకోను.  పైజమాస్‌ వేసుకుంటున్నా.  బీచ్‌లో సరదాగా షికారుకు వెళ్లాలనుంది. లాక్‌డౌన్‌ ఎత్తేశాక, కేరళలోని బెకల్‌ బీచ్‌కి వెళతా. ఇప్పట్లో దేశం దాటి బయటకు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు కదా.. బికినీ వేసుకుని ప్రయువేటుగా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తా  అని పూజా హెగ్డే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: