కరోనా ప్రభావం వల్ల ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే పరిస్థితి లేకపోవడం తో పలు ఓటిటి సంస్థలు విడుదలకు సిద్ధంగా వున్న సినిమాలపై కన్నేశాయి. చిన్న సినిమాలతో పాటు మినిమం హైప్ వున్న సినిమాలను దక్కించుకోవడానికి నిర్మాతలకు భారీ మొత్తం లో ఆఫర్ చేస్తూ డైరెక్ట్ గా డిజిటల్ విడుదలకు ఒప్పించే పనిలో పడ్డాయి అందులో భాగంగా ఇప్పటికే  అమెజాన్ ప్రైమ్ హిందీ తోపాటు తమిళ , కన్నడ , మలయాళం లో కలిపి 7సినిమాలను డైరెక్ట్ గా డిజిటల్ విడుదలచేయడానికి రెడీ గా వుంది. ఇక టాలీవుడ్ లోకూడా ఇదే ట్రెండ్ కొనసాగేలా వుంది. ఇప్పటికే నిశ్శబ్దం థియేటర్ రిలీజ్ లేకుండా  డైరెక్ట్ గా ప్రైమ్ లో విడుదలకావడం దాదాపు ఖాయమైంది.
 
ఇక ఇప్పుడు మరో సినిమా కూడా డైరెక్ట్ గా ఓటిటి లో  విడుదలకానుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే ఉప్పెన. ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుంది. ఈ డిజిటల్ హక్కుల కోసం ప్రైమ్ ,ఆహాలు పోటీపడుతున్నాయట. త్వరలోనే ఈసినిమా రిలీజ్ విషయంలో పూర్తి క్లారిటీ రానుంది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా బుచ్చి బాబు సాన డైరెక్ట్ చేస్తున్నాడు. ఈముగ్గురికి ఇదే మొదటి సినిమా.
 
రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుమారు 20కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్  ఈ సినిమా ను నిర్మిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: