టాలీవుడ్ లో ఉన్న బడా ప్రొడ్యూసర్లలో డీవీవీ దానయ్య కూడా ఉంటారు. ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు మూడు దశాబ్దాల కాలంలో 20కి పైగా సినిమాలు నిర్మించారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసింది ఈ బ్యానర్. ఈ బ్యానర్ అధినేతగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న దానయ్య ఇప్పుడు తన కుమారుడు దాసరి కల్యాణ్ ను హీరోను చేయాలని భావిస్తున్నారు. గతంలోనే ఈ విషయంపై పలు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొడుకును హీరోను చేయడంపై దానయ్య దృష్టి పెట్టాడని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది.

 

 

లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం.. వంటి సినిమాలను తెరకెక్కించిన శ్రీవాస్ దర్శకత్వంలో కల్యాణ్ దాసరి హీరోగా పరిచమవుతున్నాడని తెలుస్తోంది. ఇందుకు తగ్గ కథ శ్రీవాస్ సిద్ధం చేశాడని అంటున్నారు. ఈ మేరకు దానయ్య కూడా కథను ఓకే చేసాడని అంటున్నారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులు సద్దుమణిగాక ఈ సినిమాను సొంత ప్రొడక్షన్ లోనే మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కథ పూర్తి స్క్రిప్టు పూర్తి చేసే పనిలో శ్రీవాస్ ఉన్నాడని అంటున్నారు. క్యాస్ట్ అండ్ క్రూ ని కూడా ఈ సమయంలోనే దాదాపు ఫిక్స్ చేస్తారని అంటున్నారు. సాక్ష్యం తర్వాత శ్రీవాస్ దర్శకత్వం వహించే సినిమా ఇదే కానుంది.

 

 

మరోవైపు దానయ్య ఇండియాలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తన డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పై తెరకెక్కిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ఈ సినిమా దాదాపు 70 శాతం పూర్తైంది. ఇప్పటికే రామ్ చరణ్ పై వచ్చిన టీజర్ అదిరిపోయింది. ఎన్టీఆర్ పుట్టినరోజున మరో టీజర్ రానుంది. ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. నిర్మాత దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: