వరసగా మూడు పరాజయాల తరువాత  యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న నాలుగవ చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కరోనా లేకుంటే ఏప్రిల్ లోనే విడుదలకావాల్సి ఉండగా అంతలోనే  ఈమహమ్మారి రావడంతో విడుదల వాయిదాపడింది. ఇక ఈ సినిమా ను దసరా కానుకగా విడుదలచేయాలని నిర్మాతలు భావిస్తున్నారట అయితే దసరా కు పోటీ ఎక్కువగా వుండనుండంతో అఖిల్ సినిమా కు థియేటర్లు సమస్య ఏర్పడే అవకాశం లేకపోలేదు అసలే ఈ సినిమా అఖిల్ కెరీర్ ను డిసైడ్ చేయనుండడం తో ఇలాంటి టైం లో రిస్క్ చేస్తున్నారు. ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. 
 
 గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అఖిల్, హలో ,మిస్టర్ మజ్నుతో హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసిన అఖిల్.. ఈ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరోవైపు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కు కూడా ఈ సినిమా విజయం కీలకం కానుంది. పరుగు తరువాత భారీ పరాజయాలను చవిచూసిన  భాస్కర్ ఎలాగైనా ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ తో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని పట్టుదలతో వున్నాడు. మరి ఈ సినిమా వీరిద్దరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా తరువాత అఖిల్ ఇప్పటివరకు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బ్యాచ్ లర్ విడుదలయ్యాకే అఖిల్ తదుపరి సినిమాకు ఓకే  చెప్పేలా వున్నాడు. త్వరలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ టీజర్ విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: