టాలీవుడ్ లో కొందరు సినిమాలు చేసినా చేయకపోయినా సరే వాళ్ళ గురించి మాత్రం ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. రోజు రోజుకి కూడా వాళ్ళ గురించి వార్తలు ఎక్కువ గా వస్తూ ఉంటాయి గాని తగ్గే అవకాశాలు దాదాపుగా ఉండవు. ఇక సినిమా ఇండస్ట్రీ అంటేనే పెద్ద గాసిప్ ల మయం. అందులోనూ హీరోయిన్ల గురించి చెప్పేదే ముంటుంది. హీరోయిన్లు ఏం చేయకపోయినా గాసిప్లు రాసేస్తుంటారు. వాళ్లు ఎవరితో అయినా సన్నిహితంగా ఉంటే ఇక గాసిప్ ల రచ్చ మామూలుగా ఉండదు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ ఛార్మి విషయంలో ఇదే విధంగా వార్తలు వస్తూ ఉంటాయి. ఆమె సినిమాలు చేసినా చేయకపోయినా సరే ఆమె గురించి మాత్రం ఏదోక ప్రచారం మనకు వినపడుతూనే ఉంటుంది.
ఛార్మీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు... ఆమె సినిమాల్లో నటిస్తున్నప్పుడు కంటే సినిమాలు మానేశాకే ఆమె గురించి జరుగుతోన్న గాసిప్ ల ప్రచారం అంతా ఇంతా కాదు. తాజాగా ఆమె పెళ్లి గురించి ఒక ప్రచారం జరిగింది. అది ఏంటీ అంటే ఆమె పెళ్లి చేసుకోవాలని చూసింది అని కాని కొందరు వ్యక్తులు వద్దని ఆపారాని సమాచారం. ఎందుకు ఆపారు ఏంటీ అనేది పక్కన పెడితే దీని గురించి టాలీవుడ్ లో పెద్ద రచ్చే జరుగుతోంది. ఆమె లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకోవాలని భావించింది అని కాని కుదరలేదు అని అంటున్నారు.
ఏది ఎలా ఉన్నా సరే అనవసర వార్తలు అన్నీ కూడా టాలీవుడ్ లో వస్తూనే ఉంటాయి. మరి ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు. ఇక పంజాబ్ కు చెందిన ఆర్మీ ఇప్పుడు హైదరాబాద్ లో స్థిరపడిపోయింది. ఆమె టాలీవుడ్ కు చెందిన ఓ డైరెక్టర్ తోనే ఎక్కువుగా ఉంటుందన్న దానిపై ఎన్ని రకాల వార్తలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వీరిద్దరు కలిసి రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారట. పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిన వీరిని గతేడాది వచ్చిన ఓ సినిమా ఆదుకోవడంతో కాస్త బయట పడ్డారని సమాచారం.