టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే హవా నడుస్తుంది అనేది వాస్తవం. ఆమె గురించి ఎప్పుడు కూడా ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఆమె సినిమాలకు సంబంధించి ఇటీవల కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆమె గురించి కథనాలు మనం చదువుతూనే ఉన్నాం. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఆమెతో నటించేందుకు వరుసగా క్యూలో ఉన్నారు అనేది వాస్తవం. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ నుంచి చెప్పుకుంటూ పోతే మీడియం రేంజ్ హీరోలు కూడా ఆమె తమ సినిమాలో చేస్తే బాగుంటుందని ఆశలతో ఉన్నారు. పూజాకు ప్రస్తుతం తెలుగు యువతలో అలాంటి క్రేజ్ ఉంది.
ఇక ఇప్పుడు ఆమె ఒక బోల్డ్ సినిమా చేయడానికి ఓకే చెప్పింది అని సమాచారం. ఆ సినిమా ఎవరి తో చేస్తుంది ఏంటీ అనేది తెలియదు గాని ఒక బాలీవుడ్ దర్శకుడు మాత్రం ఆమె తో సినిమా చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికే ఈ సినిమా కథ కూడా విని ఓకే చేసింది అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆమె అఖిల్ హీరో గా ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.
ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో అఖిల్ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలను చేస్తుంది. ఈ సినిమాలు వచ్చే ఏడాది రానున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడు ఆమె సినిమాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందరు అగ్ర హీరోలతో చేయడమే కాకుండా ఎక్కువగా హిట్స్ కొడుతుంది ఆమె. ఇక ప్రభాస్ తో కూడా ఆమె ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ ప్రేమ కథతో తెరకెక్కే ఈ సినిమా ఇక వచ్చే యేడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.