టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమా అనగానే జనాలకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి అనేది ఉంటుంది. వారి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే భావన లో జనాలు కూడా ఉన్నారు. రెండు సినిమాలు జల్సా, ఆ తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. పవన్ కెరీర్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు 2008లో వచ్చిన జల్సా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కెరీర్ వరుస ప్లాపులతో డౌన్లో పడిపోయింది. ఆ తర్వాత 2013లో వచ్చిన అత్తారింటికి దారేది పవన్ కెరీర్లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అయితే మూడో సినిమా అజ్ఞాతవాసి సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా ఇక వచ్చే అవకాశం లేదనే ప్రచారం చేశారు జనాలు. కాని ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు చూస్తే... ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ ఆసక్తి చూపిస్తున్నాడు అంటున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ నుంచి ఆయనకు హామీ వచ్చింది అని కొందరు అంటే.... పవన్ కళ్యాణ్ అడగడం తో సినిమా చేయడానికి ఓకే చేసాడు అని మరి కొందరు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ కి ఎప్పటి నుంచో త్రివిక్రమ్ తో సినిమా చేసి తన కెరీర్లోనే తిరుగులేని హిట్ కొట్టాలన్న కసి అయితే ఉంది. ఇక రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అటు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో కమిట్ అయ్యాడు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత ఎప్పుడైనా వీరి కాంబోలో సినిమా ఉంటుందంటున్నారు. సమాజానికి తగిన విధంగా ఒక సినిమాను చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ నుంచి కూడా పవన్ కి స్పష్టమైన హామీ కూడా వచ్చింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.