ప్రభాస్ 'బాహుబలి' సినిమా తో ప్రపంచ స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించాడు. అంతకుముందు వరకూ టాలీవుడ్ ఇండస్ట్రీ వరకే పరిమితమైన ప్రభాస్ 'బాహుబలి' సినిమా తో రాష్ట్ర మరియు దేశ సరిహద్దులు దాటిపోయింది. 'బాహుబలి' సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారిపోయిన విషయం అందరికీ తెలుసు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రభాస్ కి ఎవరూ ఊహించనంతగా మార్కెట్ ప్రస్తుతం ఉంది. కాగా బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా అదే స్థాయిలో విజయం సాధించాలని ఈ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు కష్టపడ్డారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో హాలీవుడ్ స్థాయిలో ఫైట్స్ ఉండాలని హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి టెక్నీషియన్స్ తీసుకొచ్చి మరీ ఫైట్స్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ మొదటి షోకే వచ్చింది. దెబ్బకి రెండు సంవత్సరాల టైం ప్రభాస్ కేటాయించడంతో సినిమా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్లుగా నిరుత్సాహం చెందారు.

 

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రేమకథా నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా అయిన వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించబోయే సైన్స్ ఫిక్షన్ జోనర్ లో భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా రానా నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. 'బాహుబలి' సినిమాలో బల్లాల దేవ పాత్రలో రానా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

 

దీంతో నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రభాస్ కి విలన్ గా రాణా చేయబోతున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో గట్టిగా వినబడుతున్నాయి. వెండితెరపై ఇద్దరు కనబడినప్పుడు నువ్వానేనా అన్నట్టుగా స్క్రీన్ ప్రజెంట్ బాహుబలి లో చేశాడు రాజమౌళి. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా లో మళ్లీ రానా విల్లన్ గా ఉండబోతున్నటు వార్త నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: