వరుడు సినిమా.. ఆకాశ పందిర్లు.. భూలోక సందళ్ళు.. శ్రీరస్తు శుభమస్తు! అంటూ వచ్చే సాంగ్ వరుడు సినిమాలోది.. సినిమా చూస్తే తప్ప తెలియదు.. ఈ సినిమాలో పాటలు తప్ప స్టోరీ లేదు అని.. అట్టర్ ప్లాప్ సినిమా. అలాంటి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈ సినిమాలో భాను శ్రీ మెహ్రాను ఓ రేంజ్ లో వాడేశారు. 

 

గుణశేఖర్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన వరుడు సినిమా ప్రమోషన్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. దినికి కారణం ఆ సినిమాలో హీరోయిన్‌ భాను శ్రీ మెహ్రాను సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎక్కడ చూపించలేదు.. దీంతో అభిమానులు అంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. చివరికి సినిమాలో చూపించారు. 

 

ఇంకా అంతే.. ఈమె ఏం అంత అందంగా ఉంది అని ఈమెని ఎవరికి చూపించకుండా ఓవర్ యాక్షన్ చేశారు అంటూ సినిమా చుసిన ప్రతి ప్రేక్షకుడు తిట్టేవాళ్ళు. ఇంకా సినిమాలో కథ లేకపోవడంతో సినిమా డిజాస్టర్ అయింది. దాంతో అలా ఒక్క సినిమాకే భాను శ్రీ హీరోయిన్ గా పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది.

 

అయితే ఆ తర్వాత కొన్ని పాత్రల్లో నటించింది.. రామ్ చరణ్ గోవిందుడు అందరి వాడేలే సినిమాలో చిన్న రోల్ అండ్ 2014 లో వచ్చిన అలా ఎలా సినిమా లాస్ట్ కనిపించినా ఈ హీరోయిన్ మళ్లీ ఈ సినిమాలు చేయలేదు... కానీ ఈ సంవత్సరం ఈమెకు సంబంధించిన మిస్ ఇండియా చిత్రం విడుదలవ్వాల్సింది కానీ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఇప్పటి వరుకు ఈ సినిమా రిలీజ్ కాలేదు .                                        

మరింత సమాచారం తెలుసుకోండి: