టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ కు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. యువ హీరోలు కూడా సరైన కథ దొరికితే మల్టీస్టారర్ సినిమాలకు సై అనేస్తున్నారు. ఇద్దరు మాస్ హీరోలు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారట. ఇంతకీ ఎవరా ఇద్దరు హీరోలు అంటే ఒకరు మాస్ మహారాజ్ రవితేజ కాగా మరొకరు మెగా సుప్రీం హీరో సాయి తేజ్. రవితేజ తర్వాత మాస్ ఆడియెన్స్ కు దగ్గరైన మెగా హీరోగా సాయి తేజ్ పేరు వినపడుతుంది.

 
రవితేజ, సాయి తేజ్ ఇద్దరు మాస్ ఆడియెన్స్ కు దగ్గరైన హీరోలే.. పక్కాగా చెప్పాలనే మన పక్కింటి అబ్బాయిల్లా ఉంటారు. అందుకే వారు చేసే సినిమాలు మినిమమ్ గ్యారెంటీగా ఉంటాయి. అయిదు ఈమధ్య రవితేజ పూర్తిగా ట్రాక్ తప్పుగా సాయి తేజ్ వరుస ప్లాపుల నుండి తప్పించుకుని గత రెండు సినిమాలు హిట్లు కొట్టాడు. ఆడియెన్స్ లో మంచి మాస్ ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరి కలిసి మల్టీస్టారర్ చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ కాంబినేషన్ సెట్ చేసే కథ ఎవరు రాస్తారు.. ఏ డైరక్టర్ ఈ ఇద్దరితో మల్టీస్టారర్ తీస్తాడో చూడాలి. 


ఈ కాంబో సెట్ ఐతే మాత్రం కచ్చితంగా ఇదో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే రామ్ చరణ్, తారక్ కలిసి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ అదిరిపోయే మల్టీస్టారర్ సినిమాగా వస్తుండగా ఆ సినిమా తర్వాత మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు తెలుగులో వస్తాయని చెప్పొచ్చు. అందులో ఈ మాస్ హీరోలు ఇద్దరు రవితేజ, సాయి తేజ్ కలిసి చేసే సినిమా వస్తే మాత్రం ఆడియెన్స్ కు పండుగే. మరి ఈ కాంబో సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.        

మరింత సమాచారం తెలుసుకోండి: