తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయమై ఎన్నో ఏళ్ల పాటు తమ సత్తా చాటి ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంటారు . మరి కొంతమంది కేవలం రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితం అవుతారు. కొంతమంది హీరోయిన్లు గుర్తింపు తెచ్చుకోవడానికి సమయం  పట్టిన ఆ తర్వాత మాత్రం చిత్ర పరిశ్రమలో పాతుకుపోతారు. కొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే ఒక రేంజ్ లో చిత్ర పరిశ్రమ ను ఉపేస్తుంటారు. కానీ ఆ తర్వాత మాత్రం సినిమాలు లేదా ఒకవేళ నటించిన ఆ సినిమా ఆడక కనుమరుగైపోతు ఉంటారు. 

 

 ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్లు ఎవరు అంటే ముందుగా టక్కున గుర్తొచ్చే పేరు షాలిని  పాండే . విజయ్ దేవరకొండ హీరో గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో... తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో  అర్జున్ రెడ్డి ప్రియురాలి పాత్రలో నటిస్తోంది శాలిని పాండే. సినిమాలో శాలిని పాండే పాత్రకు అసలు ఎక్కువ డైలాగ్స్ ఎక్కడ ఉండవు. 

 

 

 కానీ తన చూపులతో తన హావభావాలతో నే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది శాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో ఎంత సెన్సేషనల్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శాలిని పాండే కి డైలాగులు లేకున్నప్పటికీ తనదైన నటనతో ఆకట్టుకుంది. అదేసమయంలో ఈ సినిమాలో రొమాన్స్ కానీ లిప్ లాక్ సీన్లు కానీ ఒక రేంజ్ లో ఉండడంతో... ఈ అమ్మడు ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ను షేక్ చేసింది అని చెప్పాలి. యూత్ ని ఎంతగానో ఆకర్షించిన ఈ అమ్మడు.. ఒక్కసారిగా చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ సంపాదించింది. 

 

 

 అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత శాలిని పాండే స్టార్ హీరోయిన్ గా మారుతుంది అని అందరూ అనుకున్నారు.వరుస  అవకాశాలు వచ్చి ఈ అమ్మడి చెంత వాలుతాయి అని అనుకున్నారు. దర్శక నిర్మాతలందరూ శాలిని పాండే దగ్గరికి వరుస సినిమాలతో క్యూ కడతారు అని ఎంతగానో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఏదీ జరగలేదు. అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ స్టార్ హీరో రేంజ్లో ఎదిగితే అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన శాలిని పాండేకు  మాత్రం కనీస అవకాశాలు కూడా రాలేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన శాలిని పాండే ఆ తర్వాత మాత్రం పూర్తిగా కనుమరుగై పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: