హీరోయిన్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికి చెరగని స్థానమే. తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ వారందరికీ పోటీని ఇస్తూ తన హవాను నడిపించింది. దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు స్టార్ హీరోల సరసన నటించింది. చిలిపి నవ్వుతో  ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. తన నటనతో దర్శక నిర్మాతలు సైతం ఆకట్టుకుంది. కానీ చివరికి తెలుగు తెరపై కనిపించకుండా పోయింది. కాదు ఈ లోకాన్ని విడిచి పోయింది. 

 

 

 ఆ హీరోయిన్ ఎవరో కాదు సౌందర్య.. దాదాపు కొన్నేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది సౌందర్య. ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయినా సౌందర్య ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో  ఉన్న మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలందరి సరసనా నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కూడా నటించి తన నటనతో ఆకట్టుకుంది సౌందర్య. కానీ ప్రమాదవశాత్తు విమాన ప్రయాణంలో కన్నుమూసింది. 

 

 

 అది సౌందర్య అభిమానులందరికీ మర్చిపోలేని రోజు. అప్పటికే చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సౌందర్య... వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న శివశంకర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది సౌందర్య.  ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే.... ఈ సినిమా చిత్రీకరణ కోసం విమానంలో ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు విమానం కూలి మరణించింది సౌందర్య. దీంతో  అభిమానులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: