పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి జల్సా(2008) అత్తారింటికి దారేది(2013), అజ్ఞాతవాసి(2018) సినిమాలు తెరకెక్కించారు. ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలు తెలుగు ఇండస్ట్రీ లో ఏ సినిమాలు చేయాలని రికార్డులను చేసి సంచలనం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే అప్పట్లో ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ప్రేక్షకులంతా కొండంత నమ్మకంతో థియేటర్లకు వచ్చారు అంటే అతిశయోక్తి కాదు.


పవన్ రాజకీయరంగంలో ఆరంగేట్రం చేసిన తర్వాత తీసిన అజ్ఞాతవాసి అంతంతమాత్రంగానే ఆడింది కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై గానీ, పవన్ కళ్యాణ్ పై గానీ ప్రేక్షకులు ఎటువంటి విమర్శలు చేయలేదు. సినీ పరిశ్రమలో విజయాలు అపజయాలు సర్వసాధారణమని... అపజయాల గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని అభిమానులతో సహా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారట. నిజానికి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే చూడాలని ఎంతో మంది ఆశపడుతున్నారు. అయితే వారి ఆశలు నెరవేరే సమయం త్వరలోనే ఉందని తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలుపుతుంది.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ కింద తెరకెక్కనున్న సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనుండగా... పవన్ కళ్యాణ్ కథానాయకుడి పాత్రలో నటించనున్నాడు. వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యి థియేటర్లలో రిలీజ్ కాగానే... పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందట. ఇప్పటికే శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం స్క్రిప్ట్ రాయటం కూడా పూర్తి చేశాడట. పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని పవన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అన్ని పాత్రలకు కాస్ట్ అండ్ క్రూ సెట్ అవ్వగానే అధికారికంగా ఒక ప్రకటన విడుదల అవుతుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: