గత కొంతకాలంగా ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువగా  ప్రాధాన్యమిస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది అనుష్క. ఇక ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సస్పెన్స్ థ్రిల్లర్గా తలకెక్కిన నిశ్శబ్దం అనే సినిమాలో నటించింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా... ఓ సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మొదటిసారి అనుష్క మూగ చెవిటి అమ్మాయి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది . ఇక ఈ సినిమాను  పీఫుల్ మీడియ ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్  కార్పొరేషన్ పతాకంపై కోనవెంకట్ , టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. 

 

 

 ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అనుష్క నటిస్తుండగా... మాధవన్ అంజలి శాలిని పాండే లాంటి నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని భావించారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి కావడంతో విడుదల చేద్దాం అనుకున్న తరుణంలో లాక్ డౌన్  అమలు కావడంతో ఈ సినిమా విడుదల కాస్త వాయిదా పడింది. అయితే ప్రస్తుతం సినిమా థియేటర్లు మూతపడటం  ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కూడా లేకపోవడంతో చాలామంది తమ సినిమాలను ఓటిటి లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు. 

 

 

 ఈ క్రమంలోనే నిశ్శబ్దం సినిమాను కూడా ఓటిటీలో విడుదల చేయబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర నిర్మాత కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా పట్ల మాకున్న అమితమైన ఆసక్తి ప్రేమతోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాము... ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాం.. మేము తీసిన సినిమా చూసి థియేటర్లో ప్రేక్షకులు ఇచ్చిన రియాక్షన్ మాకు ప్రేరణగా నిలుస్తోంది.. అదే మాకు ఆక్సిజన్... ఆ ఫీలింగ్ ను ఏది మ్యాచ్ చేయలేదు.. సినిమా ఉన్నది సినిమా హాల్ల కోసమే అదే మా ప్రాధాన్యం కూడా అంటూ కోనవెంకట్ తెలుపడంతో ప్రస్తుతం ఈ సినిమా పై వస్తున్న వార్తలను చెక్  పెట్టినట్లయ్యింది .

మరింత సమాచారం తెలుసుకోండి: