బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ లవ్ మ్యారేజెస్  ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో పెళ్ళికి సిద్ధంగా ఉన్న బాలీవుడ్ ప్రేమ జంట ఏది అంటే అందరికీ గుర్తొచ్చేది ఆలియాభట్ రణబీర్ కపూర్. ఎంతోమంది ముద్దుగుమ్మలతో ఎన్నో ఏళ్ల పాటు ప్రేమాయణం నడిపిన రణబీర్ కపూర్ చివరికి ఆలియా భట్ తో  ప్రస్తుతం ప్రేమలో కొనసాగుతున్నాడు. ఇక వీరిద్దరి ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. 

 

 

 అయితే అటు బిటౌన్లో ఎప్పటికప్పుడు ఈ జంటపై ఏదో ఒకటి వార్త వస్తూనే ఉంటుంది. అంతకు ముందు వరకు వీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అని ఒక రూమర్ తెరమీదకి రాగా అది అవాస్తవం అని తేలిపోయింది. అయితే ప్రస్తుతం ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని  త్వరలో వీరి పెళ్లి జరగబోతుంది అని ప్రస్తుతం మరొక వార్త బీ టౌన్ లో హల్ చల్ చేస్తోంది. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవలే రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో ఎవరైనా మరణిస్తే సంవత్సరంలోపు ఏదైనా శుభకార్యం చేస్తూ ఉంటారు

 

 

 ప్రస్తుతం ఇదే కారణంతో వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని  ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. లాక్ డౌన్ ముగియగానే వీరి  వివాహం ఉంటుందని అంటున్నారు. త్వరలో రణబీర్ కపూర్ ఓ  ఇంటి వాడు కాబోతున్నాడు అని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ జ్యోతిష్యుడు ఈ జంట కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించి అందరికీ షాకిచ్చాడు. ఆలియా భట్ రణబీర్ కపూర్ జాతకాలను పోల్చి చూస్తే ఇద్దరి జాతకాలు ఎంతగానో బాగున్నాయని.. పెళ్లి తర్వాత వీరిద్దరి కెరీర్ మరింత ఊపందుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఆలియాభట్ జాతకరీత్యా పెళ్లి తర్వాత భర్తతో మనస్పర్థలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని... దీనిని వారికి సంబంధించిన జ్యోతిష్యులు పరిష్కరిస్తానని అనుకుంటున్నా అంటూ ముంబైకి చెందిన వినోద్ అనే జ్యోతిష్కుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కాగా ఈ పోస్ట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: