చార్మి..చార్మింగ్ బ్యూటీ. ఒకనాడు తన అందంతో సినిమాలను ఆడించిన హాట్ హీరోయిన్. కేవలం పదిహేనేళ్ళ వయసులో హీరోయిన్ గా తెలుగులో నీ తోడు కావాలి అంటూ అరంగేట్రం చేసింది. ఆ సినిమా తరువాత ఆమెకు పెద్ద హీరోల పక్కన అవకాశాలు వచ్చాయి. దాంతో వరసగా నటిస్తూ టాలీవుడ్ అగ్ర హీరోల పక్కన నచ్చిన జంట అనిపించుకుంది.

 

బాలక్రిష్ణ‌తో అల్లరి పిడుగు మూవీలో పెయిర్ గా చేసిన చార్మి, విక్టరీ వెంకటేష్ లక్ష్మి మూవీలో ఆయన సరసగా ఆడి పాడి యూత్ గుండెలను కొల్లగొట్టింది. నాగార్జున మాస్ మూవీతో ఓ ఊపు ఊపేసింది. ఇక నాగ్ మేనల్లుడు సుమంత్ పక్కన గౌరీలో అదరగొట్టి ఆ మూవీ హిట్ లో తన వాటాను పెంచేసుకుంది.

 

మోహన్ బాబు వంటి సీనియర్ ని కూడా పొలిటికల్ రౌడీ మూవీతో కవ్వించి కేక పెట్టించిన చార్మీ గత కొంతకాలంగా సినిమాలు చేయడం ఆపేసింది. ఆమె చివరిసారిగా చేసిన మూవీ జ్యోతీలక్ష్మి. ఈ మూవీ తరువాత ఇప్పటివరకూ ముఖానికి రంగు వేసుకోలేదు. అయితే చార్మి పుట్టిన రోజు మే 17. ఈ పుట్టిన రోజు సందర్భంగా చార్మి ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చేసింది.

 

తాను ఇకపై తెర మీద నటించను అంటూ చెప్పేసింది. తాను నిర్మాతగానే ఉంటాను అంటోంది. నిర్మాత అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని కూడా చెబుతోంది. తాను తీసే సినిమాలు హిట్ కావాలంటే తన వంతు పూర్తి భాగస్వామ్యం ఉండాలని అంటోంది. డైరెకటర్ పూరీ జగన్నాధ్ తో కలసి చార్మీ మూవీస్  తీస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తో బిగ్ హిట్ కొట్టిన చార్మీ ఇపుడు ఫైటెర్ మూవీని విజయ్ దేవరకొండతో తీస్తోంది.

 

ఈ మూవీతో పాటు, ఆకాష్ పూరీతో రొమాంటిక్ మూవీ కూడా తీస్తోంది. ఈ రెండు అయ్యాక వరస సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్న ఈ ముద్దు గుమ్మ ఇస్మార్ట్ శంకర్ హిట్ తో లాభాలు గురించి అడగవద్దు అంటోంది. నిర్మాత ఎంత పెద్ద హిట్ ఇచ్చినా కూడా అతనికి డబ్బులు తిరిగి వెనక్కు రావడం కష్టమేనని టాప్ సీక్రెట్ ని కూడా చెప్పేసింది. మొత్తానికి చార్మి ని వెండి తెరపైన ఇకపైన చూసే అవకాశం రాదన్న మాట. ఇది ఆమె ఫ్యాన్స్ కి చేదు వార్తే మరి. భరించక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: