టాలీవుడ్ లో పెళ్లి అయినా సరే కొందరికి మాత్రం డిమాండ్ అనేది తగ్గడం లేదు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్  సమంతా. ఆమెకు పెళ్లి అయినా సరే క్రేజ్ మాత్రం ఏ విధంగా కూడా తగ్గడం లేదు అనేది అర్ధమవుతుంది. స‌మంత తెలుగు సినిమా చ‌రిత్ర‌కు ఓ మూల స్తంభం అయిన అక్కినేని ఇంట్లో కోడ‌లు అయినా కూడా ఆమెకు సౌత్ ఇండియాలో తిరుగులేని క్రేజ్ ఉంది. ఆమె ప్రస్తుతం ఏ సినిమాలో చేయడం లేదు గాని ఆమెను ఇప్పుడు సుకుమార్ తన సినిమాలో చేయమని అడిగినట్టు సమాచారం. దీనిపై ఆమె ఓకే అని చెప్పింది అని తెలుస్తోంది. 

 

ఆమె గురించి అతను ప్రయత్నాలు మొదలుపెట్టి సక్సెస్ కావడం తో కథలో ఆమె పాత్రను వివరించాడు అని అంటున్నారు. పుష్ప సినిమాలో ఆమె పాత్ర గుడ్డి మహిళ గా ఉంటుంది అని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఆమె నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పెళ్లి అయ్యాక స‌మంత న‌టించిన రంగ‌స్థ‌లం, జాను, ఓ బేబీ సినిమాల్లో న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల‌నే ఆమె ఎంచుకుంది. అందుకే ఆమె పాత్ర విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుని ఓకే చేసాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఆమె కూడా ఇప్పుడు ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో సుకుమార్ ఆమె పాత్రను ఇంకా నీట్‌ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే ఆమెను అల్లు అర్జున్ మాత్రం స‌మంత వద్దు అని అంటున్నాడు అని... కాని బన్నీ కి అతను చెప్పి ఒప్పించాడు అని కూడా ఇండ‌స్ట్రీ టాక్‌..? తనకు అసలు పూర్తిగా సమంతా నే తీసుకోవాలని ఉందని రష్మిక అంచనాలకు తగిన విధంగా నటించలేదు అని చెప్పాడట. దీనితో హీరోయిన్ మార్చే ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: