టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ ల కొరత చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది హీరోయిన్స్ ని తీసుకోవాలని భావించిన సరే కమర్షియల్ అనే కోణం లో వాళ్ళు ఉపయోగపడే అవకాశం లేదు కాబట్టి వాళ్ళను పక్కన పెట్టారు దర్శక నిర్మాతలు. మన తెలుగులో ఇప్పుడు రష్మిక పూజ మినహా ఎవరూ కూడా పెద్దగా కనపడటం లేదు అనే చెప్పవచ్చు. వీళ్ళ ఇద్దరికీ ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. వీళ్ళ సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు సూపర్ హిట్ అవ్వడం తో వాళ్లకు మంచి ఆఫర్లు వస్తున్నాయి అనేది వాస్తవ౦. 

 

మన తెలుగులో ఇప్పుడు కొందరు హీరోయిన్ లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అందులో ప్రధానంగా శ్రుతీ హాసన్ ఒకరు. ఆమెకు తెలుగులో ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని తనకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ తో ఆమె ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు ఆమెకు పవన్ క్రిష్ సినిమాలో ఒక కీలక పాత్రకు అవకాశం వచ్చింది అని సమాచారం. మరి ఆమె చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఆమెకు ఆఫర్ మాత్రం వచ్చింది అనేది వాస్తవం. 

 

ఆమె ఆ సినిమా కోసం చాల మారాల్సి ఉంటుంది అని మరి ఆమె మారుతుందా లేదా అనేది చూడాలి. ఆమెను కావాలని పవన్ కళ్యాణ్ అడగడం తోనే క్రిష్ ఆమె ను తన సినిమాకు ఎంపిక చేసాడు అని అంటున్నారు. త్వరలోనే ఆమె కొన్ని సినిమాల్లో వేగంగా నటించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. ఒకటి సూర్య హీరోగా వస్తున్న సినిమా అయితే మరొకటి అజిత్ హీరో గా వస్తున్న సినిమా. ఈ రెండు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆపేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: