గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో తిరుగులేని స్టేటస్ ని అందుకున్న శృతి హాసన్, ఆ తర్వాత వచ్చిన రేసుగుర్రంలోనూ మెప్పించింది. హిట్ల మీద హిట్లు వరుస హిట్లతో దుసుకుపోతున్న శృతిహాసన్ కి గత కొన్ని రోజులుగా కలిసి రావట్లేదు. సడెన్ గా ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో కనిపించక చాలా రోజులైంది. కాటమరాయుడు సినిమా తర్వాత  ఆమె మళ్ళీ కనిపించలేదు.

 

కాటమరాయుడు సినిమాలో ఆమె లుక్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. మరో బొద్దుగా ఉండడమే కాకుండా, సినిమాలో ఆక్టింగ్ పై కూడా విమర్శలు చేశారు. అదలా ఉంచితే ప్రస్తుతం రవితేజ చేస్తున్న క్రాక్ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్నాడు. అయితే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందట.

 

సినిమా ఇమ్డస్ట్రీపై కరోనా ప్రభావం మామూలుగా లేదు. నిర్మాతలు ఆర్థికంగా చితికిపోతున్నారు. రోజువారి కూలీలు పనిలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. షూటింగులు లేక, డబ్బులు రాక ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆర్థికంగా బాగా దెబ్బతినడంతో ఒకానొక నటుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అర్థిక నష్టాలు స్టార్ హీరోయిన్లకి కూడా ఉన్నాయి. శృతిహాసన్ కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఎదుర్కొంటుందట.

 

కరోనా కారణంగా ఫైనాన్షియల్ ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ అవడంతో ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడిందట. బ్యాంకు లోన్స్ కట్టడం.. ఇతరత్రా వ్యవహారాలకి ఆమెకి డబ్బు అవసరం చాలా ఉందట. అయితే తండ్రి కమల్ హాసన్ ని అడిగితే డబ్బులు ఇచ్చేస్తాడని, కానీ అలా అడగడం తనకి ఇష్టం లేదని పేర్కొంది. మొత్తానికి స్టార్ హీరోయిన్ అయినా కూడా అమ్మడికి ఆర్థికంగా కష్టాలు తప్పట్లేదన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: