సమీరా రెడ్డి... ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమాతో టాలీవుడ్‌కు పరియయమైన హీరోయిన్. ఈ తర్వాత చిరంజీవితో కలిసి ‘జై చిరంజీవ’.. సూర్యతో కలిసి ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్'.. ఎన్టీఆర్ 'అశోక్' సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అయితే హిందీ తమిళంలో మంచి విజయాలు సొంతం చేసుకుంది. చివరిగా ‘వరదనాయక’ అనే కన్నడ సినిమాలో నటించిన సమీరా తెలుగులో చివరిగా 'కృష్ణం వందే జగద్గురుమ్'లో మెరిసింది. ఆ తర్వాత ముంబయికి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్నారు. సమీరాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సమీరా తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటారు. ఇంతకముందు గర్భధారణ సమయంలో.. ప్రసవానంతరం ఎదుర్కొన్న శరీరాకృతి సమస్యలు.. మహిళలు స్వతంత్రంగా గౌరవంగా జీవించాలంటూ అనేక అంశాలను అభిమానులతో షేర్ చేసుకుంది.

 

లాక్ డౌన్ సమయంలో తన కుటుంబంతో ముంబై లో కలిసి ఎంజాయ్ చేస్తోంది సమీరారెడ్డి. ముఖ్యంగా తన పిల్లలు హన్స్ మరియు నైరా లతో కాలక్షేపం చేస్తోంది. తన పిల్లలతో కలిసి డాన్స్ చేస్తూ.. సాంగ్స్ పడుతూ వాటిని వీడియోస్ రూపంలో బందిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. సమీరా ప్రతిరోజు పిల్లలతో అట్లాడిస్తూ వారికి కొత్త కొత్త గేమ్స్ పరిచయం చేస్తూ.. వీలైనంతగా వారిని నవ్విస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు లేటెస్టుగా ఏ క్లీనింగ్ బేబీ అంటూ మరో పోస్ట్ తో వచ్చింది. తన బేబీ నైరా తల్లికి ఇల్లు క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాడంటూ వీడియో వదిలింది. దీంట్లో నైరా వాటర్ తాగి బయటకి ఉంచి.. మళ్ళీ క్లీన్ చేస్తూ కూర్చున్నాడు. తన ముద్దు ముద్దు చేష్టలు చూసిన వారికి ముచ్చట గొలుపుతాయి. మొత్తానికి ఈ లాక్ డౌన్ సమయాన్ని చాలా బాగా వాడుకుంటుందట. ఇక సమీరా పెళ్లి విషయానికొస్తే సినిమాటిక్ గా జరిగిందని చెప్పవచ్చు. స్వతహాగా బైక్స్ అంటే ఇష్టపడే సమీరా బైక్ బిజినెస్ చేసే అక్షయ్ వర్దేని బైక్ రైడింగ్ తో కలిసింది. వీరిద్దరికి బైక్స్ మీద ఉన్న ప్యాషన్ వీరిని ఒకటిగా చేసింది. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: