పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో కొన సాగుతూనే మరోవైపు మూడు సినిమాలలో నటించేందుకు సిద్దమయ్యాడు. పార్టీని నడిపేందుకు ఆర్థికపరంగా కాస్త బలపడేందుకు తను సినిమాల్లో నటిస్తున్నానని పవన్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్ కి సంబంధించిన షూటింగు 80% వరకు పూర్తి చేశాడు. ఈ సినిమా అయిపోగానే ఏం రత్నం నిర్మాణంలో క్రిస్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతాడు. అలాగే మైత్రి మూవీ సంస్థ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 


క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొగలాయిల కాలం నాటి కథ నేపథ్యంలో తెరకెక్కనుండగా... కోహినూర్ వజ్రం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంటుంది. ఈ సినిమాకి విరూపాక్ష అనే టైటిల్ ఖరారు అయినట్టు నాగబాబు వెల్లడించాడు. ఈచిత్రంలో పవర్ స్టార్ ద్వి పాత్రలలో నటించనున్నాడని... వాటిలో ఒకటి దొంగ పాత్ర కాగా మరొకటి పోరాటయోధుడు పాత్ర అని సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఎవరు నటిస్తారనే ది తెలియరాలేదు. 


రాజకీయరంగంలో దూసుకుపోతూ... సినిమాలు తీసి పార్టీకి అవసరమైనంత డబ్బులు డబ్బులు సంపాదించాలని పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళిక రూపొందించుకున్నాడు. కానీ కరోనా మహమ్మారి భారత దేశంలో అడుగుపెట్టి అతని ప్లాన్ ని మొత్తం చెడగొట్టింది. కానీ పవన్ డైరెక్టర్ క్రిష్ క్రిష్ మాత్రం తన సినిమా త్వరగా అయిపోయింది నాకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందులోని భాగంగానే క్రిష్ జాగర్లమూడి ఇంజనీర్ గా మారి ఆర్ట్ డైరెక్టర్ కు సినిమా సెట్ ప్లాన్ గీసి పంపించాడట. అయితే కృషి చేసిన ఆ సినిమా సెట్ ప్లాన్ సూపర్ పర్ఫెక్ట్ గా ఉందట. అది చూసి ఆర్ట్ డైరెక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్య పోయాడట. లాక్ డౌన్ ఎత్తి వేసిన క్రిష్ జాగర్లమూడి చేసిన ప్లాన్ ప్రకారం రామోజీ ఫిలిం సిటీ లో ఆర్ట్ డైరెక్టర్ సెట్స్ వేస్తాడు. ఏది ఏమైనా పవన్ సినిమా త్వరగా అయిపోయింది క్రిష్ జాగర్లమూడి ఇంజనీర్ గా మారటం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: