కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలో సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. షూటింగ్ పూర్తయి కూడా సినిమా హాల్స్ తెరవకపోవడంతో సినిమాలన్నీ రిలీజ్ కాకుండా అలాగే ఉండిపోయాయి. ఇక మన టాలీవుడ్ లో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికే మూడు, నాలుగు చిన్న సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉండగా వాటిని రిలీజ్ చేయడానికి లాక్ డౌన్ కారణంగా వాటిని రిలీజ్ చేయలేకపోతున్నారు. 

 


ఇక మన టాలీవుడ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తిరిగి మళ్ళీ స్క్రీన్ మీద చూద్దాం అనుకున్నా పవన్ ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అన్ని సినిమాలు షూటింగ్ ఆగిపోయాయి. దీనితో పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా కూడా 80% షూటింగ్ పూర్తి అయిన మిగతా షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు షూటింగ్ కోసం మరికొన్ని రోజుల్లో టైం పట్టేలా కనిపిస్తోంది. దీనికోసం ఆ సినిమా విడుదల కూడా చాలా సమయం పడేలా కనిపిస్తోంది.

 


మొదటగా మే 15న వస్తుందనుకున్న వకీల్ సాబ్ ఆ తర్వాత దానిని ఆగస్టు 15 కి వస్తుందని వార్తల్లో వచ్చాయి. ఇకపోతే తాజాగా బోనీకపూర్ లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేసే వరకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా నిర్మాణ సంస్థలో జరుగుతున్న సినిమా షూటింగ్ మొదలు పెట్టాము అని అలాగే వాటి రిలీజ్ డేట్ లు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇంకేముంది దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద షాకే తగిలింది. పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూద్దామనుకుంటే ఫ్యాన్స్ కు మరికొన్ని రోజులు సమయం పడేలా కనిపిస్తుంది. ఏది ఏమైనా తెలుగు ప్రజలకు సినిమాలు లేక తెగ ఇబ్బంది పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: