టాలీవుడ్ లో ఈ మద్య కొంత మంది హీరోయిన్లకు భలే అదృష్టం కలిసి వస్తుంది. ఆ మద్య ఛలో సినిమాతో కన్నడ బ్యూటీ రిష్మిక మందనకు బాగా కలిసి వచ్చింది.  తర్వాత గీతాగోవిందం, దేవదాసు, సరిరేరు నీకెవ్వరు ఇలా వరుస విజయాలు అందుకుంటూ వస్తుంది. చేసిన రెండు మూడు సినిమాలకే స్టార్ హీరోయిన్ హోదా లభిస్తుంది. మజ్ను, ఇస్మార్ట్ శంకర్ తో ఒక్కసారే తెగ పాపులారిటీ తెచ్చుకుంది నిధి అగర్వాల్. ఈ  మద్య టాలీవుడ్ లో నిధి అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సీనీ రంగం ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎప్పటికప్పుడు హిట్స్ పడితేనే వెలుగుతుంటారు. లేకపోతే ఆ వెలుగు ఆరిపోతుంది.

 

తన హాట్ హాట్ అందాలతో ఇప్పటికే ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న నిధి అగర్వాల్  ప్రస్తుతం లాక్ డౌన్  సమయం కావడంతో సినిమా షూటింగ్ లు అన్నీ నిలిచిపోవడంతో ఇంటిపట్టున ఉంటుంది. అయితే లాక్ డౌన్ సమయంలో ఎన్నో ఆసక్తికర విషయాలను చెబుతోంది నిధి అగర్వాల్. నేను ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నాను. షూటింగ్ కోసం నేను హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. విమానాశ్రయానికి వచ్చాను. అప్పుడే లాక్ డౌన్ అని ప్రకటించారు. ఇక నేరుగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇంట్లో పప్పి కుక్కపిల్లలు చాలానే ఉన్నాయి. వాటితో హాయిగా ఆడుకుంటున్నాను.  

 

అదే సమయంలో టివిల్లో లాక్ డౌన్ వల్ల ప్రజలు బాధపడుతుంటే చూశాను. నా మనస్సు తరుక్కుపోయింది. మా ఇంటికి దగ్గరలోని అనాథశ్రయాలకు వెళ్ళాను. అక్కడ మొత్తం ఆరు ఛారిటబుల్ ట్రస్టులు ఉన్నాయి. అక్కడ వలస కూలీలు కూడా ఉన్నారు.. వారి బాధలు చూసి వారికి తమ స్వస్థలానికి వెళ్లేందుకు డబ్బులు ఇచ్చాను.. వారికి కావాల్సిన ఆహారం అందించాను. అయితే ఇవన్నీ ఫోటోలు తీయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.. మనం చేసే పనికనపడితే చాలు మనం కాదు అంటుంది ఈ బ్యూటీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: