ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ లు అన్నీ ఆగి పోయాయి. ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సిని  సెలబ్రిటీలు అందరు బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే సినీ గాసిప్ జర్నలిస్టులకు అసలు పని లేకుండా పోయింది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమై ఉన్నప్పుడు సినిమా గాసిప్ వెబ్సైట్లకి ఎక్కడ అసలు కొత్త వార్త  దొరకదు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అలరిస్తున్నప్పటికీ ప్రముఖ మీడియా సంస్థలలకు గాసిప్పులూ ఎక్కడ దొరకవు. 


 కానీ జర్నలిస్టులూ  మాత్రం ఏదో ఒక విధంగా లభించిన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ముక్యంగా  ప్రముఖ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు... ఎవరితో మాట్లాడుతున్నారు.. ఎలాంటి సినిమా చేస్తున్నారు ఇలాంటివి అన్నింటి గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ తాజాగా సినిమా నిలిపి వేయడంతో... సిరి సెలబ్రిటీలు ఇంటికే పరిమితం కావడంతో ఇలాంటి గాసిప్పులకు  తావే  లేకుండా పోయింది. ప్రస్తుతం అందరూ కరోనా  వైరస్ గురించి ప్రజలకు తెలిపే విధంగా వెబ్సైట్ను నడుపుతూన్నారు.  దీంతో సినిమా జర్నలిస్టులకు  పూర్తిగా పని  తగ్గిపోయాయి. 

 


 కాగా తాజాగా దీనికి సంబంధించి కరిష్మా కపూర్ పోస్ట్ పెట్టినా పోస్ట్  కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్  సమయంలో ... సంస్కృతి ఎంతో విజయవంతమైందని... కానీ ప్రముఖుల గాసిప్ దాహం మాత్రం తీరలేదు అంటూ ప్రస్తుతం ఒక పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక దీనిపై అటు నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం సినిమా షూటింగుల్లో నిలిచిపోవడంతో  సినిమా జర్నలిస్టులకు అసలు ఎలాంటి గ్యాసిప్స్ న్యూస్ దొరక కుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా మీద ఆధారపడి నడిచే వెబ్సైట్లని ప్రస్తుతం చప్పు చప్పటి  వార్తలతో నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: