దేశంలో ఓ వైపు లాక్ డౌన్ నడుస్తుంది.  సినీ పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది.. ఇక సినీమా రిలీజ్ లు కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో సినీ తారలంగా ఇంటికే పరిమితం అయ్యారు. మరికొంత మంది వేరు వేరు ప్రదేశాల్లో చిక్కుకొని అక్కడి నుంచే తమవారితో.. అభిమానులతో తమ అనుభవాలు పంచుకుంటున్నారు.  లాక్ డౌన్ వేళ సినీ తారలు కొత్త రకం వంటలు, వ్యాయామాలు, యోగ, టిప్స్, డ్యాన్స్, టిక్ టాక్ ఒక్కటేమిటి రోజూ ఏదో ఒక సందడి చేస్తూ వస్తున్నారు.

 

కానీ ఇద్దరు ముద్దుగుమ్మలు మాత్రం లాక్ డౌన్ కి కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. కాజల్, తమన్నా, కృతి సనాన్ వంటి తారలు తమ ఇన్ స్టాగ్రాం అకౌంట్లలో కమర్షియల్ యాడ్స్ కు సంబంధించిన పోస్టింగులు పెడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇన్ స్టాగ్రాంలో కాజల్ కు 14.5 మిలియన్ల ఫాలోవర్లు వుంటే, తమన్నాకు 10.5 మిలియన్ల ఫాలోవర్లు వున్నారు. దీంతో ఈ లాక్ డౌన్ సమయంలో తమ ఖాతాల ద్వారా ప్రమోషనల్ పోస్టింగులను పెడుతూ వీరు లక్షల్లో సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ భామలు కొంత మంది తమ ఖాతాల ద్వారా ప్రమోషనల్ పోస్టింగులను పెడుతూ బాగానే సంపాదిస్తున్నారని అంటున్నారు.  

 

మామూలుగా సినిమా తారలకున్న ఆదరణను బట్టి ఒక్కో పోస్టింగుకి 5 నుంచి 10 లక్షల వరకు ఆయా సంస్థలు చెల్లిస్తుంటాయి. ఈ క్రమంలో కాజల్, తమన్నాలకు ఒక్కో పోస్టింగుకి సుమారు ఐదు లక్షలు వస్తున్నట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.  ఏది ఏమైనా సెలబ్రెటీలు ఎక్కడున్నా వారి ఆదాయానికి ఢోకా లేదంటున్నారు సినీ విశ్లేషకులు.  ఇంట్లోనే ఖాళీగా వుండి కూడా ఈ ముద్దుగుమ్మలు లక్షల్లో సంపాదిస్తున్నారన్న మాట. చూశారా.. తాము సంపాదించుకున్న గ్లామరు, ఇమేజ్ ఈ ముద్దుగుమ్మలకు బాగానే పనికి వస్తుందని అంటున్నారు సినీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: