టాలీవుడ్ లో ఇప్పుడు యాంకర్ లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. యాంకర్లకు అవకాశాలు ఇవ్వడానికి ఇప్పుడు హీరోలు కూడా ఆసక్తి చూపించడం తో దర్శక నిర్మాతలు వారిని సినిమాల్లోకి తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మన తెలుగులో ఉన్న యాంకర్స్ అందరూ కూడా సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ప్రధానంగా అనసూయ. ఆమె ఒక్క అవకాశం వస్తే చాలు అనుకునే స్థాయి నుంచి నేడు చూసి జాగ్రత్తగా సినిమాలు చేద్దాం అనే స్థాయికి వెళ్ళింది అనేది వాస్తవం. 

 

ఇప్పుడు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ఆమె మాత్రం ఎక్కడా కూడా కంగారు లేకుండా సినిమాలను చేస్తుంది అనే సంగతి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో అయినా సరే ఒకటికి పది సార్లు ఆలోచన చేసి ఆమె సినిమాలు చేస్తుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. మన తెలుగులో ప్రతిభ ఉన్న నటుల వెంట ఇప్పుడు దర్శక నిర్మాతలు పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అందుకే ఆమె వెంట ఇప్పుడు దర్శక నిర్మాతలు పడుతున్నారు అని సమాచారం. 

 

ఆమె కూడా ఎక్కడా త్వర పడకుండా సినిమాలను చెయ్యాలని చూస్తుంది. అయితే ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఒక హిందీ సీరియల్ లో ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పుడు మరో హీరో సినిమాలో అక్క పాత్ర కోసం ఆమెను అడిగారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమె అందుకు ఓకే చెప్పింది అని సమాచారం. ఇది ఎంత వరకు నిజం అనేది ఇంకా స్పష్టత లేదు గాని ఇప్పుడు మాత్రం ఆమె చాలా వరకు కష్ట పడుతుంది రాబోయే పాత్ర కోసం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: