'అందాలరాక్షసి' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే దర్శక ధీరుడు రాజమౌళి నుంచి ప్రశంసలు దక్కించుకుకోవడమే కాదు ఇండస్ట్రీ దృష్ఠిని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన భలే భలే మగాడివోయ్, మంచు విష్ణు తో దూసుకెళ్తా, అల్లు శిరీష్ తో  శ్రీరస్తు శుభమస్తు, మన్మధుడు నాగార్జున తో  సోగ్గాడే చిన్ని నాయనా లాంటి సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇక మనం సినిమాలోను చిన్న పాత్ర పోషించింది. దాంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు. కాని లావణ్య ఆ అంచనాలను అందుకోలేకపోయింది.

 

ఇందుకు కారణం మొదటి సినిమా అందాల రాక్షసి సినిమా నుండి నటనకి ప్రాముఖ్యత ఉన్న పాత్రలనే ఎంచుకోవడమే. ఇక తను నటించిన మిస్టర్, రాధ, ఇంటిలిజెంట్, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో కెరీర్ లో వచ్చిన ఫాం ఒక్కసారిగా పడిపోయింది. ఇదే సమయంలో రష్మిక మందన్న, పూజా హెగ్డే దూసుకు వచ్చారు. దాంతో టాలీవుడ్ లో లావణ్య త్రిపాఠి కి హీరోయిన్ అవకాశాలు రావడం కష్టమని అనుకున్నారు. అయితే నిఖిల్ తో రీసెంట్ గా వచ్చిన 'అర్జున్ సురవరం' సినిమా తో సక్సెస్ అందుకొని అందరికి షాకిచ్చింది.

 

దాంతో లావణ్య త్రిపాఠి మళ్ళీ పోటీకి సిద్దమయింది. రీసెంట్ గా తమిళంలో 'గద్దలకొండ గణేష్' ఫేమ్ అధర్వ మురళీ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్' లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తోంది. వీటితో పాటు కార్తికేయ హీరోగా నటిస్తున్న 'చావు కబురు చల్లగా'లో హీరోయిన్ గాను ఎంపికైంది. అంతేకాదు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బికినీ కి రెడీ అంటూ మేకర్స్ కి హింట్ ఇచ్చింది.

 

అయితే ఇది కేవలం సినిమాలకే కాదు వెబ్ సిరీస్ లను నిర్మించే మేకర్స్ కి సిగ్నల్ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఓటిటి కి ప్రేక్షకులౌ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అందులో భాగంగా కొన్ని సినిమాలని నేరుగా ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. అందుకే లావణయ ఇలా షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిందని అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: