పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత పవన్ కళ్యాణ్ శృతిహాసన్ మీద ఒక సాంగ్ ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాని బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ గా తెలుగులో పవర్ స్టార్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే సినిమాని కోలీవుడ్ లో అజిత్ తో నిర్మించారు. అటు హిందీ ఇటు తమిళంలో ఈ సినిమా 100 కోట్ల వసూళ్ళని వసూళ్ళు చేసింది. ఇప్పుడు ఈ రికార్డ్స్ ని బద్దలు కొట్టడమే వకీల్ సాబ్ లక్ష్యం. 

 

అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో ఉన్న పాత్ర నివేదా థామస్ ది. హిందీలో ఈ పాత్రని తాప్సీ పోషించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక ఈ పాత్రలో నివేదా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అందులో అనుమానమే లేదు. అయితే నివేదా ఇలా బ్యాక్ టు బ్యాక్ తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ లో అలాగే వకీల్ సాబ్ లో పవర్ స్టార్ తో నటించడం గొప్ప విషయమని చెప్పాలి. అలాగే కీర్తి సురేష్ కూడా రజనీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే. 

 

ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా నటిస్తుంది. అయితే పాత్ర ఏమిటి అన్నది తెలియలేదు. హీరోయిన్ గా నయన తార, ఇతర ముఖ్య పాత్రల్లో మీనా, ఖుష్బూ నటిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ సినిమాలలో వస్తున్న అవకాశాలు గొప్పవే అయినప్పటికి ఆ సినిమాల ద్వారా వస్తున్న ఫేం ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. ఏ సినిమాలోనైనా స్టార్ హీరో పక్కన హీరోయిన్ అయితే వచ్చే క్రేజ్ అండ్ పాపులారిటి వేరు.

 

కాని భారీ కాస్టింగ్ ఉన్న సినిమాలలో పాత్ర అంటే కాస్త రిస్కే. అయితే ప్రస్తుతం ఉన్న చాలా మంది హీరోయిన్స్ కి సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లతో ఒక్క సీన్ లో అయినా స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ చాలా గొప్పగా భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: