బాహుబలి రెండు భాగాల సూపర్ డూపర్ హిట్స్ తరువాత ఇటు మన దేశంలోనే కాక పలు ఇతర దేశాల్లో కూడా హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించిన రెబల్ స్టార్ ప్రభాస్, ఇటీవల వాటి అనంతరం వచ్చిన సాహో సినిమాతో ఆ క్రేజ్ ని మరింతగా పెంచుకున్నారు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ప్రభాస్, ఎలాగైనా ఆ సినిమాతో కూడా మరొక హిట్ కొట్టి తన ఇమేజ్ ని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సినిమాలో ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే. 

 

వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినిదత్ నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాని, ఈ ఏడాది చివర్లో ప్రారంభించి వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల నాగ అశ్విన్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ సినిమా కథ, కథనాలు, నటీనటుల ఎంపిక వంటి వారి గురించిన అన్ని కార్యక్రమాలు సిద్ధం అవుతున్నాయని, అన్ని అనుకున్నట్లు జరిగితే పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయబోయే ఈ సినిమా ఇండియన్ ఫిలిం హిస్టరీ లో ఒక గొప్ప సినిమాగా నిలిపే ప్రయత్నం చేస్తాం అని అశ్వినీదత్ ఇటీవల మాట్లాడుతూ చెప్పారు. వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే ప్రభాస్ తో ఒక సినిమా చేయవలసిందని, అయితే అనుకోని కారణాల వలన అది కుదరకపోవడం, అలానే ఇప్పుడు సడన్ గా ప్రభాస్ ఎంతో గొప్ప సూపర్ స్టార్ అయిన తరువాత తమకు ఆయన తో సినిమా తీసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అశ్వినిదత్. 

 

కాగా ఈ సినిమాని ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ జానర్ లో తీయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ రెండు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారని, వాటిలో ఒకటి మాస్ పాత్ర కాగా, మరొకటి క్లాస్ పాత్ర అని అంటున్నారు. కాగా రెండు పాత్రలను ఎంతో అద్భుతంగా డిజైన్ చేసిన దర్శకుడు అశ్విన్, సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తీయనున్నట్లు టాక్. మరి ఈ వార్తే కనుక నిజం అయితే బాహుబలి తరువాత ప్రభాస్ ని వెండితెరపై డ్యూయల్ రోల్ లో చూడవచ్చన్నమాట......!!   

మరింత సమాచారం తెలుసుకోండి: