సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్నటి సంక్రాంతి పండుగ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంతకముందు భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు సూపర్ హిట్స్ కొట్టిన మహేష్, ఇటీవల సరిలేరు తో మరొక విజయాన్ని అందుకుని మొత్తంగా హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. అయితే సరిలేరు రిలీజ్ అయి ఐదు నెలలు దాటుతున్నప్పటికీ కూడా మహేష్ తన తదుపరి సినిమా ప్రకటించకపోవడంతో ఆయన అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు. ఇక గత కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్న వార్తలను నిజం చేస్తూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా తన నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్నట్లు యువ దర్శకుడు పరశురామ్ -ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా చూసిన తరువాత తనకు సినిమాల్లోకి రావాలనే ఆశ కలిగిందని, ఆ తరువాత సినిమా ఇండస్ట్రీ కి వచ్చి తొలిసారిగా నిఖిల్ సిద్దార్థ హీరోగా వచ్చిన యువత సినిమాతో దర్శకుడిగా అవకాశం దక్కడం ఎంతో ఆనందం అని చెప్పిన పరశురామ్, తొలిసారిగా తనకు ఇష్టమైన హీరో మహేష్ తో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా తన జీవితంలో ఎంతో గొప్ప సదావకాశం అని పరశురామ్ అన్నారు. ఇకపోతే ఈ సినిమా అధికారిక ప్రకటన ఈ నెల 31వ తేదీన రానున్నట్లు తెలుస్తోంది. 

 

ప్రతి ఏడాది తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించి ఏదో విశేషాన్ని ప్రకటించే అలవాటు ఉన్న మహేష్ బాబు, ఈసారి అదే రోజున తన 27వ సినిమా అనౌన్స్ మెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి అయినట్లు చెప్తున్నారు. మరి అన్ని అనుకున్నట్లు జరిగితే, లాక్ డౌన్ అనంతరం పట్టాలెక్కబోయే ఈ సినిమా, వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం...!!  

మరింత సమాచారం తెలుసుకోండి: