నందమూరి నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యువ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. బాల నటుడిగా రామాయణం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఎన్టీఆర్‌ తొలి సినిమాతోనే తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఆహార్యంలోనూ, అభినయంలోనూ ఆ ఎన్టీఆర్‌ను గుర్తు చేశాడు. తెరపై రాముడిగా తారక రాముడ్ని చూసి అభిమానులు మురిసిపోయారు.

 

అయితే తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత దగ్గర మాత్రం చెడ్డపేరును మూటగట్టుకున్నాడు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ను బాలనటుడిగా పరిచయం చేసిన నిర్మాత ఎమ్‌ఎస్‌ రెడ్డి. మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత. బాల రామాయణం సినిమాకు కథ రెడీ చేసిన తరువాత దర్శకుడు గుణశేఖర్ నటీనటుల కోసం ఆడిషన్స్‌ చేస్తుండగా మల్లెమాల స్వయంగా ఎన్టీఆర్ పేరును ప్రపోజ్ చేశాడట.

 

ఆ సమయంలో దర్శకుడు గుణశేఖర్, ఎన్టీఆర్‌ వద్దని వారించే ప్రయత్నం చేసినా మల్లెమాల పట్టుబట్టి మరీ ఆ అవకాశాన్ని ఎన్టీఆర్‌కు ఇచ్చిచాడు. ఆ సినిమాతో ఎన్టీఆర్‌ కు మంచి గుర్తింపు రావటమే కాదు. నటుడిగా ఇండస్ట్రీలో సుస్థిర స్థానం ఏర్పడింది. అయితే ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నిర్మాతను ఎన్టీఆర్‌ తీవ్రంగా అవమానించాడట.

 

ఎన్టీఆర్‌ హీరోగా స్థిరపడిన తరువాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాలన్న ఉద్దేశంతో మల్లెమాల ఒకసారి ఎన్టీఆర్ ను కలిసేందుకు వెళితే గంటల తరబడి వెయిట్ చేయించాడట. కనీసం నా వయసుకు కూడా ఎన్టీఆర్ గౌరవం ఇవ్వలేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.

 

అంతేకాదు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తన ఆత్మకథలో ప్రస్థావించాడు మల్లెమాల. అంతేకాదు బాల రామాయణం చిత్రం దర్శకుడు గుణశేఖర్‌, సీనియర్‌ ఎన్టీఆర్‌ల మీద కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు మల్లెమాల.

మరింత సమాచారం తెలుసుకోండి: