బాహుబలి ద్వారా నేషన్ వైడ్ ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్, ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అనంతరం ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడన్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

 

ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు చక చకా జరిగిపోతున్నాయి. లాక్డౌన్ వల్ల స్క్రిప్టుని ఇంకా మెరిగులు దిద్దడానికి వీలు కలిగింది. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ భామని తీసుకోవాలని చూస్తున్నారు. సైంటిఫిక్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఎక్కడా కాంపమైజ్ కాకూడదని చిత్ర నిర్మాత అశ్వనీదత్ భావిస్తున్నాడట. అందుకోసం హీరోయిన్ కి ఎంత పారితోషికం ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడట.

 

ఫిలిమ్ నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకునేని తీసుకోనున్నారట. దీపికాకి బాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉంది. అదీగాక ప్రభాస్ సరసన దీపికా అయితే బాగుంటుందని భావిస్తున్నారట. అయితే దీపికా పదుకునే రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. ప్రస్తుతం ౮౩ సినిమాలో రణ్ వీర్ సింగ్ కి జోడీగా చేస్తున్న ఆమె ఆరుకోట్లకి పైగానే తీసుకుందని అన్నారు.

 

ఇక ప్రభాస్ సినిమా కోసం ౧౫ కోట్ల వరకి డిమాండ్ ఉండనుందట. హీరోయిన్ కోసం అంతగా ఖర్చు పెట్టి దీపికాని ఒప్పిస్తారా లేదా చూడాలి. నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం ఎన్ని డబ్బులు పెట్టడానికైనా సిద్ధమే అని చెప్పాడు. సో ఒకవేళ దీపికా ఒప్పుకుంటే ఆమె డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇచ్చుకోవడానికి రెడీగా ఉంటారని చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: