యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా 'జిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 1970 కాలానికి సంబంధించిన ఒక పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో సెట్ వేసి చిత్రీకరించి ఇండియాకి తిరిగి వచ్చారు. 'డార్లింగ్' స్టార్ ప్రభాస్ - బుట్టబొమ్మ పూజా హెగ్డే కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నాడట. ప్యూర్ అండ్ సెన్సిబుల్ లవర్స్ గా కనిపించే ప్రభాస్ - పూజా హెడ్గేల మధ్య కెమిస్ట్రీ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందట.

 

ప్రస్తుతం పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన షెడ్యూల్స్ కూడా ఫారిన్ ఓ ప్లాన్ చేశారట చిత్ర యూనిట్. కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాము. దానితో సినిమా పరిశ్రమకు కూడా పెద్ద బ్రేక్ పడింది. దీనితో మన టాలీవుడ్ నుంచి కొన్ని కీలక చిత్రాలు ఇతర దేశాల్లో షూటింగ్స్ జరుపుకోవాల్సినవి ఆగాల్సి వచ్చింది. కానీ విదేశీ యాత్రలకి ఇప్పుడప్పుడే పర్మిషన్ రాకపోవచ్చు. పరిస్థితులు అనుకూలించే వరకు వేరే దేశాలు కూడా పరదేశీయులని ఇప్పట్లో ఆహ్వానించే పరిస్థితి లేదు. దీంతో ఈ చిత్రాన్ని ఇక్కడే ఎలా పూర్తి చేయాలనే దానిపై తలలు బాదుకుంటున్నారు. స్టోరీ నేపథ్యాన్ని ఇండియాకి మార్చడమా లేక సెట్స్ వేయడమా అనే దానిపై సమాలోచనలు జరిపి చివరికి ఇక్కడే సెట్స్ వేసి తీయాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమా ఎక్కువ టాకీ పార్ట్ ఇతర దేశాలలో తియ్యాల్సి ఉందట. ఇప్పటికే చాలా వరకు బయట జరిగినా ఇక మీదట మాత్రం ఆ బయట లొకేషన్లనే ఇక్కడికి తీసుకురాబోతున్నారట. అన్ని కీలకమైన షాట్లకు మన దగ్గరే పర్ఫెక్ట్ సెట్టింగ్స్ వేసి మంచి అవుట్ ఫుట్ ఇవ్వాలని టీం అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది చివ‌ర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: