జస్ట్ రెండే సినిమాలు తీసిన సుజిత్ .. ఏకంగా మెగాస్టార్ తో సినిమా చేస్తానని కలలో కూడా అనుకుని ఉండడు . అలాంటిది.. మెగాస్టారే సుజిత్ ని సెలక్ట్ చేసి లూసిఫర్ పని చూడమని  ఈ యంగ్ డైరెక్టర్ చేతిలో పెట్టాడు . మెగాస్టార్ కోసం లూసిఫర్ రెడీ అయ్యాడు . ఇక క్యారెక్టర్ ఎక్కడమే లేటు అంటున్నాడు.

 

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక స్పీడ్ మీదున్న మెగాస్టార్   చేస్తున్న ఆచార్య సినిమా ఇంకా షూటింగ్ అవ్వలేదు. రిలీజ్ ఎప్పుడున్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మెగాస్టార్ తన నెక్ట్స్ సినిమాల మీద మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే.. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ రైట్స్ ని ఎప్పుడో తీసుకున్న మెగాస్టార్ ఇప్పుడు ఆ సినిమా పనుల్ని స్పీడప్ చేస్తున్నారు.

 

మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సూపర్  హిట్ సినిమా మల్టీ స్టారర్ గా ఇంట్రస్టింగ్ గా తెరకెక్కింది. ఇప్పుడు ఆ సినిమా రీమేక్ బాధ్యతల్ని సుజిత్ కి అప్పగించారు మెగాస్టార్. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో తన సినిమా పనుల్ని  చెక్ చేసుకుంటున్న చిరంజీవి  సుజిత్ తో లూసిఫర్ కి ఫైనల్ టచప్స్ ఇమ్మని చెప్పారట. రన్ రాజా రన్, సాహో సినిమాలు డైరెక్ట్ చేసిన  డైరెక్టర్ సుజిత్ తో లూసిఫర్ సినిమా రీమేక్ చెయ్యబోతున్నారు చిరంజీవి.

 

ఆచార్య షూటింగ్ అయిపోయి  ఈ సినిమా కొలిక్కి వచ్చాక లూసిఫర్ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. సుజిత్ కూడా మళయాళ సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టు మార్చి  బౌండెడ స్క్రిప్ట్ రెడీ చేశాడట సుజిత్ .  లూసిఫర్ ని ఈ సంవత్సరం చివరికి షూటింగ్ కోసం సిద్దం చెయ్యాలనుకుంటున్నారు మెగాస్టార్ అండ్ టీమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: