కోలీవుడ్, టాలీవుడ్ లో వరుసగా లేడీ విలన్ ఛాన్సులు దక్కించుకుంటున్న అందాల భామ వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా పెళ్లిపై తనదైన స్టైల్లో స్పందించింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్కు డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్గా పేరుంది. ఆమె నటనే కాదు మాటలు కూడా చాలా పవర్ఫుల్గా, బోల్డ్గా ఉంటాయి. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ విలన్గా పలు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన వరలక్ష్మి. ఈ మద్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవుతుంది. రవితేజ నటిస్తున్న క్రాక్ మూవీలో విలన్ గా నటిస్తున్నట్లు టాక్. సందీప్ కిషన్ హీరోగా వస్తోన్న ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాతో వరలక్ష్మి టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
వరలక్ష్మి మంచి గ్లామర్ పాత్రల్లో నటించి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టే సామర్థ్యం ఉన్నా.. తనకు నచ్చినట్టు ఉండే స్వభావం కల వ్యక్తి... అందుకే ఎలాంటి ప్రయోగాత్మక పాత్రలకైనా తాను సిద్దం అంటుంది. గత కొన్ని రోజుల నుంచి తమిళ హీరో విశాల్తో వరలక్ష్మికి పెళ్లంటూ గతంలో పలుసార్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తల గురించి ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరోసారి వరలక్ష్మి పెళ్లి వార్తలు తెర పైకి వచ్చాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. నా ప్రమేయం లేకుండా నా పెళ్లి వార్తలు తెగ వైరల్ అవతున్నాయి. `
ఏంటో.. నేను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎప్పుడూ నాకే ఆలస్యంగా తెలుస్తుంటుంది. ఎప్పటిలాగానే మళ్లీ చెత్త రూమర్స్. ఎందుకు అందరూ నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నా అందరూ నా పెళ్లిపై ఆలోచనలు పెట్టుకుంటున్నారు.. ఒకవేళ నాకు పెళ్లి కుదిరితే ఆ విషయం మా ఇంటి మేడ మీద నుంచి గట్టిగా అరిచి చెబుతా. నా పెళ్లి గురించి రాస్తున్న మీడియా వారందరికీ చెబుతున్నా.. నేనిప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. సినిమాల నుంచి తప్పుకోవడం లేదు` అని సోషల్ మాద్యంలో పోస్ట్ చేసింది.