సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. భరత్ అనే నేను, మహర్షి మరియు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు మహేష్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఈ ఏడాది వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. మహేష్ మరియు అనిల్ రావిపూడి కెరియర్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు' విశిష్టత దక్కించుకుంది. ఆ నెక్స్ట్ సినిమా ఓకే చేద్దాం అని అనుకున్న సమయంలో వైరస్ రావటంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం జరిగింది.

 

దేశవ్యాప్తంగా అన్నీ ఇండస్ట్రీలలో జరుగుతున్న సినిమా షూటింగులు ఆగిపోయాయి. రిలీజ్ కావాల్సిన ప్రి రిలీజ్ సినిమా వేడుకలు, విడుదల కావాల్సిన సినిమాలు మొత్తం క్యాన్సిల్ అయ్యాయి. ఇదే సమయంలో వంశీ పైడిపల్లి దర్శకత్వం లో మహేష్ సినిమా ఉంటుంది అనుకున్న సమయంలో ఆ సినిమా ఆగిపోయింది. సినిమా స్క్రిప్ట్ లో క్లైమాక్స్ సరిగా లేదని మహేష్ వంశీ సినిమా ఆపేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అనేక మంది డైరెక్టర్లు పేర్లు విన్న తాజాగా 'గీత గోవిందం' సినిమాలో అదిరిపోయే విజయాన్ని అందుకున్న పరశురాం స్క్రిప్ట్ కి మహేష్ ఓకే చేసినట్లు వార్తలు ఇటీవల వినబడ్డాయి.

 

అయితే ఇండస్ట్రీ నుండి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెల 31వ తేదీన ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదే రోజు సినిమా విడుదల తేదీ కూడా సినిమా యూనిట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. సినిమాలో కైరా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు ఇంకా డేట్స్ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ప్రతి ఏడాది మే 31 కృష్ణ పుట్టిన రోజు తన సినిమాకి సంబంధించి ఏదో ఒకటి రిలీజ్ చేసే మహేష్ ఈసారి తన కొత్త సినిమా స్టార్ట్ చేయడం మహేష్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: