జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన 37 పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ప్రజలు అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ పేరుని మారుమ్రోగిస్తున్నారు. తెలుగు సినీ ప్రముఖులైన మహేష్ బాబు, రామ్ చరణ్ తదితరులు తారక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే కత్తి మహేష్ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొని జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

 


తను మాట్లాడుతూ... 'తారక్ గారు, హ్యాపీ బర్తడే! కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీ ఆర్ఆర్ఆర్ చిత్ర విడుదలకై చాలా మంది వేచి చూస్తున్నారు. మేము కూడా వేచి చూస్తున్నాం. నేను వండిన ఫ్రైడ్ (కేఎఫ్సి) చికెన్ మీకు బాగా నచ్చింది కానీ నేను మళ్ళీ మీకోసం వండలేక పోయాను. ఇంకొకసారి వండి పెట్టే అవకాశం నాకు రాలేదు. బహుశా అవకాశం త్వరలో రావాలని కోరుకుంటున్నాను', అని అన్నాడు. 

 


తను ఇంకా మాట్లాడుతూ... 'నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తెలుగు నటుడు కాదు. కాకూడదు కూడా. అది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడిలో అంతర్జాతీయ నటనా ప్రతిభ ఉంది. కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే అతని అద్భుతమైన నటనా చాతుర్యం పరిమితం అవుతుందేమోనని నేను భయపడుతున్నాను. మరి ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తారక్ ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో కనిపించబోతున్నారు.

 

 

రాజమౌళి సినిమా అంటే ప్రపంచం మొత్తం దాని వైపు చూస్తూ ఉంటుంది. రాజమౌళి సినిమా ద్వారా తారక్ నటనా చాతుర్యం ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలలో కాకుండా ఎన్టీఆర్ నటనా ప్రతిభను పూర్తిస్థాయిలో చూపించే సినిమాలో తారక్ నటిస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను' అని కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: