మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో కలిసి నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా 70 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చరణ్ పాత్ర ని రివీల్ చేసి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను ఉత్కంఠతను పెంచారు జక్కన్న. ఇక ఈ సినిమాలో చరణ్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సీతగా కనిపించబోతుంది. అంతేకాదు చరణ్ తారక్ పాత్రలను కలిపే కీలక పాత్ర ఆలియా ది అని సమాచారం. ఇక ఈ సినిమా 2021 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు జక్కన్న సన్నాహాలు చేస్తున్నారు.

 

సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ చేసే సినిమాలు క్లారిటి ఉన్నప్పటికి చరణ్ చేసే సినిమాలు ఏవీ ..దర్శకులు ఎవరు అన్న దాంట్లో పక్కా క్లారిటి లేదు. అయితే ఆచార్య లో మాత్రం మెగా స్టార్ తో కలిసి మెగా పవర్ స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. 30 నిముషాలు కనిపించే చరణ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాడని చెప్పుకుంటున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ కోసం ఇద్దరు దర్శకులు స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నారట. ఆ ఇద్దరే సురేందర్ రెడ్డి, వంశీ పైడి పల్లి. ఈ ఇద్దరు గతంలో చరణ్ తో సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందించారు. సురేందర్ రెడ్డి చరణ్ కాంబినేషన్ లో ధృవ వచ్చి సెన్షేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే అంతకముందు వంశీ పైడిపల్లి చరణ్ తో ఎవడు సినిమాని తీసి హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

ఇక తాజా సమాచారం ప్రకారం రాం చరణ్ నటించేసి ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందబోయో సినిమాలని తెలుస్తుంది. ఇప్పటికే వంశీ పైడిపల్లి సిద్దం చేసిన కథ చరణ్ వినాల్సి ఉంది. అయితే ఇదే కథ సూపర్ స్టార్ మహేష్ బాబు వినగా అది చరణ్ కైతే బావుంటుందని చరణ్ చేస్తానంటే నేను ప్రొడ్యూస్ చేస్తా అన్న మాట కూడా బయటకి వచ్చింది. ఇక సురేందర్ రెడ్డి మంచి పవర్ ఫుల్ కథ ని సిద్దం చేస్తుండగా చరణ్ సొంతగా నిర్మిస్తారని సమాచారం. అయితే ఈ ఇద్దరిలో ముందు ఎవరితో సినిమా మొదలవుతుందో త్వరలో క్లారిటి రానుంది. మొత్తానికి రెండు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు చరణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: