ఇప్పుడు మన తెలుగులో కొందరు హీరోయిన్ లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో రష్మిక మంద‌న్న‌ తో పాటుగా పూజ హెగ్డే ఇద్దరూ కూడా ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరూ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. పూజా హెగ్డేకు కొద్ది రోజులుగా ప‌ట్టింద‌ల్లా బంగారంగా మారిపోయింది. ఆమెతో తెలుగు స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు సినిమాలో చేసేందుకు ఏకంగా క్యూలో ఉన్నారంటూ అతిశ‌యోక్తి కాదు. అంతెందుకు హిట్ కోసం అర్రులు చాస్తోన్న ఓ కుర్ర హీరో అయితే ఆమె నా సినిమాలో చేయ‌క‌పోతే తాను సినిమానే వ‌దులుకుంటాన‌ని చెప్పిన ప‌రిస్థితి. చివ‌ర‌కు స‌ద‌రు సినిమా యూనిట్ ఆ హీరోయిన్‌కు కోట్ల‌లో పారితోష‌కం ఇచ్చి మ‌రీ హీరోయిన్‌గా బుక్ చేసింది. 

 

అటు ర‌ష్మిక క్రేజ్ కూడా అలాగే ఉంది. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత ఆమె దూకుడుకు బ్రేకుల్లేవ్‌. టాలీవుడ్ లో వీరు ఆడింది ఆట పాడింది పాట గా ఉంది అని చెప్పవచ్చు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళ కొంప ను కరోనా ముంచింది. అవును పుష్ప సినిమా నుంచి రష్మికను చిత్ర యూనిట్ పక్కకు తప్పించింద‌ని టాక్‌..? అలాగే పూజ హెగ్డే కి ముందు అడ్వాన్సు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా నో చెప్పారు. అదే విధంగా వీళ్ళు సినిమా చెయ్యాలి అనుకుంటే కచ్చితంగా పారితోషికం విషయంలో ఇబ్బంది పెట్టవకూడ‌ద‌ని... అలా అయితేనే సినిమా చెయ్యాలని సూచించారు నిర్మాతలు. వాళ్ళు సినిమా చేసే విషయంలో కండీషన్ లు అవసరం లేదని చెప్పారట. 

 

ప్రస్తుతం వీరు ఇద్దరూ సినిమాలకు ఓకే చేసినా సరే చేస్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. కరోనా వీళ్ళను బాగా ఇబ్బంది పెడుతుంది అంటున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఇప్పుడు ఇలియానాను ఓకే చేసి రష్మిక పక్కన పెట్టారని అంటున్నారు.  పారితోషికం ఆమె పెద్దగా డిమాండ్ చేయలేదు అని అందుకే ఆమెను తీసుకున్నారు అని సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: