టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ తో పాటు మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా వకీల్ సాబ్ కోర్ట్ డ్రామా సోషల్ మూవీ, అలానే క్రిష్ తో చేస్తున్న సినిమా మాత్రం పీరియాడికల్ డ్రామా మూవీ. అయితే రెండేళ్ల క్రితం అజ్ఞాతవాసి తో సినిమాలకు విరామం పలికి రాజకీయ జీవితంలో ఫుల్ గా బిజీ అయిన పవన్, మళ్ళి రెండేళ్ల తరువాత వకీల్ సాబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ సినిమాపై అటు పవన్ ఫ్యాన్స్ తో పాటు అటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మగువ మగువ పల్లవితో సాగె సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి రెండు రోజలుగా ఒక వార్త విస్తృతంగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఇప్పటికే అలవైకుంఠపురములో సినిమాలోని సాంగ్స్ తో శ్రోతలను అత్యద్భుతంగా అలరించిన థమన్, ఈ సినిమాలో మిగతా సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌడ్ స్కోర్ ని కూడా చించి అవతలేసినట్లు చెప్తున్నారు. ఇటీవల ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని ఆల్రెడీ థమన్ చెప్పడం జరిగింది. 

 

తనకు ఈ సినిమా ద్వారా తొలిసారిగా పవర్ స్టార్ తో పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని, అలానే ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ తో పాటు మిగతా సాంగ్స్ కూడా ఎంతో బాగా వచ్చాయని థమన్ చెప్పాడు. అయితే థమన్ చెప్పినట్లు కేవలం సాంగ్స్ మాత్రమే కాదు, సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్ గా వచ్చిందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తే కనుక నిజం అయితే మాత్రం పవన్ ఫ్యాన్స్ కు ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: