ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ మూవీ లో నటిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మరొక యువ హీరో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో భారీ లెవెల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎలాగైనా ఈ రెండు సినిమాలతో కూడా హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. 

 

ఇప్పటికే వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ కు, ఇవి రెండూ కూడా హిట్ కొట్టినట్లైతే ఆయన ఇమేజ్ అమాంతం మరింతగా పెరగడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక సంచలన వార్త ప్రచారం అవుతోంది. అయినను పోయి రావాలె హస్తినకు అనే పేరుతో మంచి పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పలు ఫ్యామిలీ ఎమోషనల్ అంశాల కలగలుపుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒక పాత్రలో కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అలానే సినిమాని మలుపు తిప్పే ఒక ముఖ్యమైన పాత్రలో హీరో కళ్యాణ్ రామ్ ని ఎంపిక చేశారట త్రివిక్రమ్. 

 

అయితే ప్రస్తుతం ఈ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నప్పటికీ, దీనిపై ఎక్కడా కూడా అధికారిక సమాచారం మాత్రం లేదు. ఒకవేళ ఇదే వార్త కనుక నిజం అయితే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కి ఇది పూనకాలు తెప్పించే వార్త అని చెప్పడం లో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్నిఆ అందిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం......!!!

మరింత సమాచారం తెలుసుకోండి: