సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల క్రితం కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దాని అనంతరం యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాతో మరొక సక్సెస్ కొట్టిన సూపర్ స్టార్, ఇటీవల మరొక యువ దర్శకడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు తో మరొక విజయాన్ని దక్కించుకుని వరుసగా మూడు విజయాలతో కెరీర్ హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి లాక్ డౌన్ ని ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, అతి త్వరలో తన నెక్స్ట్ సినిమాని మొదలెట్టనున్నారు. 

IHG

గీత గోవిందం సినిమాని తీసిన పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాని జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, కొరటాల శివ ప్రొడకన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నట్లు చెప్తున్నారు. అలానే ఈ సినిమాని ఈనెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఒక స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాని మంచి ఫ్యామిలీ, కమర్షియల్ స్టైల్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ సినిమా సంగీత దర్శకుడి విషయమై కొద్దిరోజలుగా పలువురు సంగీత దర్శకుల పేర్లు తెరపైకి రావడం జరిగింది. కాగా వారిలో ఎస్ ఎస్ థమన్, గోపి సుందర్, దేవిశ్రీప్రసాద్ పేర్లు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. 

 

అయితే వరుసగా మూడు సినిమాలు దేవి తో చేస్తూ వస్తున్న మహేష్, ఈ సినిమాకు థమన్ ని తీసుకంటారని కొందరు అంటుంటే, గతంలో గీత గోవిందంకు అద్భుతమైన సాంగ్స్ అందించిన గోపి సుందర్ అయితే బెటర్ అని ఇంకొందరు అంటుండగా, నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం వీరెవ్వరూ కాకుండా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాని దక్కించుకున్నట్లు చెప్తున్నారు. వాస్తవానికి మహేష్ కు గతంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన మణిశర్మ, గతంలో పరశురామ్ తీసిన యువత, సోలో సినిమాలకు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే మణిశర్మ తో తమ హీరో పని చేయాలని ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు ఇది పండుగ న్యూస్ అని చెప్పవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: