సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లో మరచిపోలేని హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. అప్పటివరకు ఒక మోస్తారు ఇమేజ్ సంపాదించిన మహేష్ కు సూపర్ స్టార్ క్రేజ్ వచ్చేలా చేశాడు పూరి. పోకిరి లాంటి సినిమా మళ్ళీ మహేష్ ఎప్పుడు తీస్తాడా అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. పోకిరి సినిమా ద్వారానే ఇలియానా తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో సాంగ్స్ కూడా ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాయి. 

 

పోకిరి తర్వాత మళ్ళీ మహేష్ పూరి కాంబోలో వచ్చిన సినిమా బిజినెస్ మెన్. ఈ సినిమాలో కూడా పూరి తన కసి చూపించాడు. మంచి ఫామ్ లో ఉన్న పూరి ఆ సినిమాతో కూడా హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ముచ్చటగా మూడోసారి మహేష్ తో పూరి కలిసి పనిచేయాలని అనుకున్నాడు. జనగణమన సబ్జెక్ట్ తో పాన్ ఇండియా రేంజ్ మూవీ ఒకటి ప్లాన్ చేశాడు. అయితే వరుస ప్లాపులు చేస్తున్న పూరి మీద నమ్మకం ఉంచలేకపోయాడు మహేష్. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూ లో పూరి జగన్నాథ్ మహేష్ కేవలం హిట్టు కొట్టిన డైరక్టర్స్ కు మాత్రమే ఛాన్స్ ఇస్తాడని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దానికి మహేష్ ఫ్యాన్స్ కూడా పూరి మీద చాలా కామెంట్స్ చేశారు. మహేష్ కన్నా మహేష్ ఫ్యాన్స్ మంచివాళ్ళు అన్నట్టుగా పూరి కామెంట్స్ ఉన్నాయి. 

 

ఇంతకీ మహేష్, పూరి జనగణమన ఉంటుందా.. ఉంటె ఎప్పుడు ఉంటుంది.. మహేష్ ఎందుకు పూరికి మరో ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కినా పూరికి మహేష్ మరో అవకాశం ఇవ్వొచ్చు కదా అంటే.. ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటే ఈ కాంబో సెట్ అయినట్టే అంటున్నారు. ఈమధ్య మహేష్ కూడా ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ జరుపుతున్నాడు. అందుకే జనగణమన చేస్తే బాగుంటుందనే సలహా ఫ్యాన్స్ ఇస్తారని అంటున్నారు. మరి ఫ్యాన్స్ బలంగా కోరుకుంటే ఆ సినిమా జరిగి తీరుతుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: