టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సినిమాలు ఆడియెన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకుంటారో అవి అంత దారుణమైన రిజల్ట్ అందుకుంటాయి. టాలెంటెడ్ డైరక్టర్ గుణశేఖర్, మాస్ మహారాజ్ రవితేజ, డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ వైవిఎస్ చౌదరి ఈ ముగ్గురు కలిసి ఒక ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారు. అదే నిప్పు. గుణశేఖర్ డైరక్షన్ లో వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించాడు. 2012లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కా బాప్ అనేలా రిజల్ట్ అందుకుంది.

 

అప్పటికే మిరపకాయ్ తర్వాత దొంగల ముఠా, వీర రెండు వరుస ప్లాపులు పడగా నిప్పుతో హిట్టు కొడతాడని అనుకోగా ఇది ఆ రెండు సినిమాలకన్నా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అసలేమాత్రం ఆకట్టుకోలేని కథ కథనాలతో వచ్చిన నిప్పు సినిమా ఎందుకు తీశారో వాళ్ళకే తెలియాలి. ఆల్రెడీ అప్పటికే సైనికుడు, వరుడు ప్లాపులతో సతమతమవుతున్న గుణశేఖర్ కు ఒక ఛాన్స్ ఇచ్చాడు వైవిఎస్ చౌదరి. ఇక్క ఈ ముగ్గురు కలయిక ఏంటంటే.. దాదాపుగా ముగ్గురు ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేయడం.. సినిమా కష్టాలు పడటం.. అన్ని ముగ్గురు అప్పటినుండి తెలిసిన వారే.. ఒకానొక సందర్భంలో రూమ్ మేట్స్ గా కూడా కలిసి ఉన్నారట. అందుకే గుణశేఖర్, వైవిఎస్ చౌదరి అడగ్గానే రవితేజ ఓకే చెప్పాడు. 

 

ముగ్గురు కలిసి అద్భుతమైన సినిమా తీస్తారని ఆశిస్తే అసలేమాత్రం ఆకట్టుకోలేని సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. సినిమాలో హీరోయిన్ గా దీక్ష సేద్ నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. రవితేజసినిమా తర్వాత దరువు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు సినిమాలు చేశాడు. అయితే మళ్ళీ బలుపు హిట్ అందుకున్నాడు.                  

మరింత సమాచారం తెలుసుకోండి: