సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చాలా ఎక్కువ. కోట్లతో కూడుకున్న వ్యాపారం కాబట్టి సెంటిమెంట్ల విషయంలో చాలా ముందుంటారు. స్టార్ హీరో నుండి స్టార్ ప్రొడ్యూసర్ వరకూ ప్రతీ ఒక్కరూ ఏదో ఒక విషయం సెంటిమెంటుని ఫాలో అవుతుంటారు. అలాంటి సెంటిమెంటే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉండనుందనేది ఇంకా తేలలేదు.

 

ఈ విషయమై రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. గతంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ గీత గోవిందం సినిమాతో తన గీత మార్చుకున్న పరశురామ్, మహేష్ తో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. ఈ విషయమై మహేష్ నుండి ఎలాంటి రిప్లై రాలేదు. దాంతో అభిమానుల్లో మళ్ళీ ఏదో అయోమయం స్టార్ట్ అయింది. అయితే వాటన్నింటికీ సమాధానం మరికొద్ది రోజుల్లో రానుంది.

 

మహేష్ ఈ పాటికే తన నెక్స్ట్ చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉండనుందో కన్ఫర్మ్ అయిపోయాడట. జస్ట్ బయటకి వెల్లడి చేయడమే మిగిలి ఉందని ఇన్ సైడ్ టాక్. మే ౩౧వ తేదీన క్రిష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన సినిమా లాంచింగ్ జరగనుందట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారట. అయితే ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఆరోజే జరగనున్నాయని సమాచారం.

 

అయితే ఈ పూజా కార్యక్రమాలకి మహేష్ హాజరు అవడంలేదని అంటున్నారు. గత కొన్ని రోజులుగా తన సినిమా లాంచింగ్ కార్యక్రమాలకి మహేష్ హాజరు కావట్లేదు. నమ్రత గారే అన్నీ దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నారు. ఈ సారి కూడా అలాగే జరగనుందట. నమ్రత గారి ఆధ్వర్యంలోనే పూజా కార్యక్రమాలు జరగనున్నాయట. అంటే మహేష్ లాంచింగ్ కార్యక్రమానికి రాకపోవడం సెంటిమెంటుగ పనిచేస్తుందేమో అనుకుంటున్నారు. మరి మహేష్ నిజంగానే ఈ సెంటిమెంటుని ఫాలో అవుతాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: