మహేష్ బాబు కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తలు వహించి బ్లాక్బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో.. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా తెరకెక్కిస్తే అది  ఏ రేంజ్ లో ఉంటుంది . సినీ ప్రేక్షకులు ఊహించిన దానికంటే హై రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే దర్శకుడు సుకుమార్ కాలిక్యులేషన్స్ ఎవరి ఊహకు అందని విధంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. తన కాలిక్యులేషన్స్ తో సినిమా చూస్తున్న ప్రేక్షకులను అబ్బుర పరుస్తూనే ఉంటారు దర్శకుడు సుకుమార్. సుకుమార్ తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ ఈ కాలిక్యులేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. 

 

 అయితే మహేష్ బాబు తో సుకుమార్సినిమా తెరకెక్కించిన  విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం  నేనొక్కడినే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ నటించింది. అయితే సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కడం తో ఇండస్ట్రీ హిట్ ఖాయమని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ టీజర్ కూడా భారీ అంచనాలను పెంచేశాయి. 

 

 ఇక చివరికి ఈ సినిమా విడుదలైంది... కానీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది ఈ సినిమా. ఎన్నో కాలిక్యులేషన్స్ తో సినిమాలు తీసినప్పటికీ... సుకుమార్ కాలిక్యులేషన్స్ ఈ సినిమాలో మాత్రం అంతగా వర్కవుట్ అవ్వలేదు అని చెప్పాలి. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు దాదాపుగా అందరూ కన్ఫ్యూషన్ లోనే ఉండి పోతారు. ఈ సినిమాలో  కలలో ఊహించుకున్నట్టుగా కొన్నిసార్లు మహేష్ బాబు విలన్ అని చంపడం.. కొన్ని కొన్ని సార్లు అదే నిజం అవుతుండటం జరుగుతూ ఉంటుంది. దీంతో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అది నిజమా కలా అనే కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. సినిమా మొత్తం కన్ఫ్యూజన్ గా ఉండడంతో సినీ ప్రేక్షకులు నిరాశతో థియేటర్ నుంచి బయటకు వస్తారు. కాగా సూపర్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా కాస్త డిజాస్టర్ గా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: