టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టడం జరిగింది. ఇక ఆ సినిమాలోని సాంగ్స్ అయితే ఎంత పెద్ద హిట్ సాధించాయో అందరికీ తెలిసిందే. గతంలో రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత సినిమా తీసి మంచి హిట్ కొట్టిన త్రివిక్రమ్, ఇప్పుడు అలవైకుంఠపురములో సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా అనంతరం ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ముగియగానే వీలైనంత త్వరలో ఎన్టీఆర్ హీరోగా సినిమాని మొదలెట్టనున్నారు త్రివిక్రమ్. 

IHG

హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఎంతో భారీ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక పవర్ఫుల్ స్టోరీ ని పక్కాగా సిద్ధం చేసిన త్రివిక్రమ్, ఎలాగైనా ఎన్టీఆర్ తో చేయబోయే ఈ సినిమాతో కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తరువాత మరొక ఇద్దరు హీరోల కోసం త్రివిక్రమ్ కథలు ఆల్మోస్ట్ సిద్ధం చేయడం ప్రారంభించారని అంటున్నారు. ఇటీవల ఒకానొక సందర్భంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించిన త్రివిక్రమ్, అది మహేష్ కు ఎంతో నచ్చడంతో ప్రస్తుతం దానిని కూడా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. అందుతున్న సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ మీదకు వెళ్లనుండగా, మహేష్ బాబు తో ఆయన చేయబోయే సినిమా రాబోయే సమ్మర్ లో పట్టాలెక్కనున్నట్లు టాక్. 

IHG

ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అతడు సూపర్ హిట్ కొట్టగా, రెండవ సినిమాగా వచ్చిన ఖలేజా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం జరిగింది. అయినప్పటికీ మొదటి నుండి మహేష్ కు, త్రివిక్రమ్ కు మంచి అనుబంధం ఉండడంతో ఎప్పటికైనా ఈ సారి మహేష్ తో చేయబోయే సినిమాతో ఆయనకు సూపర్ హిట్ ఇచ్చి తీరుతానని త్రివిక్రమ్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి వీరిద్దరి కాంబోలో రానున్న సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎంత మేర సక్సెస్ కొడుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: