సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురామ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. మెచ్యూర్డ్ లవ్ స్టోరీతో ఈ సినిమా వస్తుందట. ఇక ఈ మూవీ తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. ఎన్నాళ్ళనుండో ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబో మూవీ నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తీసే సినిమా మహేష్ తోనే అని ఫిక్స్ అయ్యాడు. 


ఇక రాజమౌళి తో మహేష్ సినిమా మరో బాహుబలి లాంటి సినిమా వస్తుందని అంటున్నారు. మాములుగా మహేష్ తో జేమ్స్ బాండ్ తరహా సినిమా తీయాలని అనుకోగా ఫ్యాన్స్ నుండి రాజమౌళికి రిక్వెస్టులు చాలా వచ్చాయట. తమ అభిమాన హీరోతో కూడా బాహుబలి లాంటి సినిమా తీయమని అడుగుతున్నారట. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ కథ రెడీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక రాజమౌళి సినిమా తర్వాత మహేష్ మరోసారి త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. 


త్రివిక్రమ్ తో అతడు, ఖలేజా సినిమాలు చేసిన మహేష్ మళ్ళీ ఆయన డైరక్షన్ లో సినిమా చేయలేదు. ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని అంటున్నారు. అల వైకుంఠపురములో సక్సెస్ తో తన సత్తా చాటిన త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా తారక్ తో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ తో ఒక సినిమా.. మహేష్ తో ఒక సినిమా ఉంటుందని టాక్. త్రివిక్రమ్ తో సినిమా హిట్ టాక్ రావాలే కానీ రికార్డులు సృష్టిస్తుంది. మరి మహేష్ తో త్రివిక్రమ్ సినిమా అనగానే ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. మరి ఆ సినిమాకు సంబందించిన డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: